logo

పేద విద్యార్థులకు ఉచిత విద్య

గోషామహల్‌ నియోజవర్గంలోని పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని నియోజకవర్గం భారాస నేత, గడ్డం గంగాధర్‌యాదవ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 02:27 IST

సమ్మేళనంలో గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: గోషామహల్‌ నియోజవర్గంలోని పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని నియోజకవర్గం భారాస నేత, గడ్డం గంగాధర్‌యాదవ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నియోజవకర్గంలో చేపట్టిన బసయాత్ర పదో విడతలో  ఆదివారం గన్‌ఫౌండ్రి డివిజన్‌లోని వెస్లీబాగ్‌లో నిర్వహించిన సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్‌ రాంచందర్‌రాజు, ఫౌండేషన్‌ ప్రతినిధులు, భారాస నేతలతోపాటు వెస్లీబాగ్‌ అధ్యక్షుడు సెల్వరాజ్‌, ప్రశాంత్‌, నవీన్‌, మధుసూదన్‌, సుందర్‌రాజ్‌, విలియం, ఆర్‌.ఎ.వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని