రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్ జీ, గురుమా
క్లీన్ ద కాస్మోస్ (సీటీసీ) ప్రచారంలో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకుని సద్గురు రమేష్ జీ, గురుమా తదితరులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
క్లీన్ ద కాస్మోస్ (సీటీసీ) ప్రచారంలో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకుని సద్గురు రమేష్ జీ, గురుమా తదితరులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. విశ్వశాంతి, మానవజాతి సంక్షేమం కోసం క్లీన్ ద కాస్మోస్ (సీటీసీ) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సద్గురు రమేష్ జీ రాష్ట్రపతికి వివరించారు. ప్రపంచ శాంతి, అందరూ ఒకటేనన్న భావనను పెంపొందించాలనేది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మనిషిలో వచ్చే ప్రతికూల ఆలోచనలను దారి మళ్లించి, మనస్సును సానుకూల అంశాలు, ప్రార్థనలతో నింపడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని, అవి విశ్వశాంతి స్థాపనకు దోహదం చేస్తాయని సద్గురు రమేష్జీ అన్నారు. ఈ సత్ సంకల్పంలో భాగంగానే సీటీసీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. స్వామి పూర్ణానంద జ్ఞాన బోధలతో ఆధ్యాత్మికవేత్తగా మారిన రమేష్జీ హఠ యోగ, కుండలిని యోగ, క్రియ యోగాలను సాధన చేశారు. హైదరాబాద్ సమీపంలో జన్వాడ వద్ద పూర్ణ ఆనంద ఆశ్రమం ప్రారంభించి సేవలు అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్