logo

పరేడ్‌ మైదానంలో ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన

ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Published : 01 Apr 2023 03:01 IST

పరేడ్‌ మైదానంలో అరుణ్‌కుమార్‌ జైన్‌. చిత్రంలో కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునఃనిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కంటోన్మెంట్‌లోని పరేడ్‌ మైదానం నుంచి సందేశమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో చేయనున్న ఏర్పాట్లను బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ వివరించగా.. అరుణ్‌కుమార్‌ పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని