మహా నగరానికి జలాభిషేకం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో మహా నగర తాగునీటి ముఖ చిత్రమే మారిపోయింది. దాదాపు రూ.18 వేల కోట్లతో ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.
పదేళ్లలో దశదిశలా పెరిగిన నీటి సరఫరా
అవుటర్ రింగ్రోడ్డు వరకు సేవల విస్తరణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో మహా నగర తాగునీటి ముఖ చిత్రమే మారిపోయింది. దాదాపు రూ.18 వేల కోట్లతో ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిత్యం 460 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని జలమండలి అందిస్తోంది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే తాగునీటికి జనం ఇబ్బందులు పడేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర నీటి అవసరాలు గుర్తించిన పాలకులు శరవేగంగా ప్రణాళిక సిద్ధం చేశారు. గోదావరి ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును నగర ప్రజలకు అందించారు.
ఈనాడు, హైదరాబాద్
అన్ని కాలాల్లో..
నగరంలో సగానికి పైగా కృష్ణా జలాలే దాహార్తి తీరుస్తున్నాయి. మూడు దశల్లో 270 ఎంజీడీలు నిత్యం నగరానికి తరలిస్తున్నారు. వేసవిలో నాగార్జున సాగర్లో నీటి మట్టాలు తగ్గినప్పుడు ఆ ప్రభావం నగరంపై పడుతోంది. ఇక నుంచి ఈ సమస్య లేకుండా ప్రభుత్వం రూ.1400 కోట్లతో చేపట్టిన సుంకిశాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
100 శాతం మురుగు శుద్ధి
నగరంలో భవిష్యత్తులో మురుగు సమస్య తీవ్రమయ్యే సూచనలున్నాయి. పదేళ్ల నుంచే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలో 100శాతం మురుగు శుద్ధి సాకారం కానుంది. గ్రేటర్లో 1650 మిలియన్ లీటర్లు నిత్యం మురుగు ఉత్పత్తి అవుతోంది. 25 మురుగు శుద్ధి కేంద్రాల ద్వారా 772 మిలియన్ గ్యాలన్లు శుద్ధి చేస్తున్నారు. త్వరలో మొదలయ్యే 31 కొత్త ఎస్టీపీల ద్వారా వందశాతం మురుగు శుద్ధి చేయనున్నారు.
శివార్ల కష్టాలకు చెక్
ప్రధాన నగరంలో కలిసినా నిత్యం నీటి కష్టాలు ఎదుర్కొన్న శివారు మున్సిపాలిటీలపై దృష్టిసారించారు. తొలుత మల్కాజిగిరి మున్సిపాలిటీలో తాగునీటి పైపులైన్లు విస్తరించారు. వేసవి వస్తే, గతంలో ఈ ప్రాంతంలో ఇళ్లు మొత్తం ఖాళీ చేసి వెళ్లేవారు. ఈ ప్రాజెక్టుతో మున్సిపాలిటీ ప్రజల కష్టాలు పూర్తిగా తీరాయి. అదే ఊపుతో రూ.1900 కోట్లతో మిగతా మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను విస్తరించారు. గతంలో 10-15 రోజులకు కూడా నీటి సరఫరా జరిగేది కాదు. ప్రస్తుతం ప్రధాన నగరంతోపాటు శివార్లకు రోజు విడిచి రోజు తాగునీటిని అందిస్తున్నారు.
అవుటర్ వరకు సేవలు
నగరానికి అవుటర్ రింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చుట్టూ కొత్త అవసరాలు ఏర్పడుతున్నాయి. చుట్టూ ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు కొత్తగా నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర కాలనీలకు తాగునీరందించడానికి సైతం పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఫేజ్-1లో 190 గ్రామాల్లో 2041 కి.మీ.మేర పైపులైను అందుబాటులోకి వచ్చింది. ఫేజ్-2 కింద మిగతా గ్రామాలను అనుసంధానం చేస్తూ 2100 కి.మీ. మేర విస్తరిస్తున్నారు.
ఇదీ గ్రేటర్ లెక్క..
* మొత్తం సర్వీసు ఏరియా- 1451.91 చ.కి.మీ.
* ప్రధాన నగరం- 169.30 చ.కి.మీ.
* శివారు మున్సిపల్ సర్కిళ్లు- 518.90 చ.కి.మీ.
* అవుటర్ రింగ్రోడ్డు గ్రామాల పరిధి- 939.80 చ.కి.మీ.
* శుద్ధి చేసిన నీటి సరఫరా తరలించే ప్రధాన పైపులు- 1500 కి.మీ
* సరఫరా లైన్లు- 8051 కి.మీ.
* నగరానికి రోజూ నీటిని తరలించే సామర్థ్యం- 602 ఎంజీడీలు
* ప్రస్తుతం సరఫరా చేస్తున్నది- 460 ఎంజీడీలు
* నల్లా కనెక్షన్లు- 12 లక్షలు
* ప్రతి వ్యక్తికి అందిస్తున్న నీళ్లు(రోజుకు)- 150 లీటర్లు
* లబ్ధి పొందే జనాభా- కోటిపైనే
అభివృద్ధి రహదారులు
గ్రేటర్లో 97 రోడ్ల విస్తరణ పూర్తి, పురోగతిలో 77
ఐఎస్బీ వెనుక నుంచి యూఎస్ కాన్సులేట్ వైపు నిర్మాణంలో ఉన్న రోడ్డు
ఈనాడు, హైదరాబాద్: రాజధానిలో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం విజయవంతంగా కొనసాగుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు వంద రహదారులు విస్తరణకు నోచుకున్నాయి. మరిన్ని విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. అభివృద్ధికి సూచికలైన రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చొరవకు ప్రగతి గణాంకాలు అద్దం పడతాయని నగర ప్రణాళిక విభాగం సంతోషం వ్యక్తం చేస్తోంది. రోడ్ల కోసం సుమారు తొమ్మిది వేల ఆస్తులను సేకరించామని, జీహెచ్ఎంసీలో ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో అది సాధ్యమైందని స్పష్టం చేస్తోంది.
మునుపెన్నడూ లేనట్లుగా..
జీహెచ్ఎంసీ ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా పైవంతెనలు, అండర్పాస్లు, ఆర్ఓబీ, ఆర్యూబీల వంటి 35 పనులు పూర్తి చేయగా, కొన్ని వేర్వేరుదశల్లో ఉన్నాయి. దానికి ముందే హైదరాబాద్ మెట్రోరైలు అభివృద్ధి సంస్థ(హెచ్ఎంఆర్) కారిడార్లలో రోడ్ల విస్తరణ మొదలైంది. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు(సీపీపీ) కింద చుట్టూ పలు రహదారుల విస్తరణ జరిగింది. ఆయా ప్రాజెక్టుల కోసం రాష్ట్ర సర్కారు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా భూ సేకరణ విభాగాన్ని ఏర్పాటుచేసింది. జిల్లా కలెక్టర్లతో సంబంధం లేకుండా భూసేకరణ పూర్తి చేసే వెసులుబాటును జీహెచ్ఎంసీకి కల్పించడంతో.. సంవత్సరాలు జరగాల్సిన పని నెలల్లో పూర్తయినట్లు ప్రణాళిక విభాగం చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!