కల సాకారమయ్యే వేళ
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో 11,700 ఇళ్లను శనివారం పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సగటున నియోజకవర్గానికి 500 చొప్పున లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించింది.
రేపు తొమ్మిది ప్రాంతాల్లో 11700 పట్టాల అందజేతకు ఏర్పాట్లు
మంత్రులు, ఉపసభాపతి,మేయర్ ఆధ్వర్యంలో..
ఈనాడు, హైదరాబాద్
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో 11,700 ఇళ్లను శనివారం పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సగటున నియోజకవర్గానికి 500 చొప్పున లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించింది. దశలవారీగా లక్ష ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ విభాగం స్పష్టం చేసింది.
మంత్రి మహేందర్రెడ్డి..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ని నార్సింగిలో నిర్మించిన 196 ఇళ్లను, బైరాగిగూడలో నిర్మించిన 160 ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి మహేందర్రెడ్డి అందజేయనున్నారు.
నల్లగండ్లలో మంత్రి తలసాని
నల్లగండ్లలో జరగనున్న పట్టాల పంపిణీలో నల్లగండ్లలో నిర్మించిన 216 ఇళ్లు, సాయినగర్లో నిర్మించిన 128 ఇళ్లను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 344 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అందజేయనున్నారు.
మంఖాల్లో మంత్రి సబిత..
రంగారెడ్డి పరిధిలోని మంఖాల్లో 2230 మంది లబ్ధిదారులకు మంత్రి సబిత ఇళ్లపట్టాలను అందజేస్తారు. మంఖాల్-1లో 500 ఇళ్లను మహేశ్వరం నియోజకవర్గం వారికి, మంఖాల్-2లోని 1730ఇళ్లను మలక్పేట్, పాతబస్తీ పరిధిలోని వారికి అందిస్తారు.
మంత్రి మహమూద్ అలీ..
చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడ, ఫరూఖ్నగర్లలో బండ్లగూడ సర్వే నెం.82, 83/పిలో నిర్మించిన 270 ఇళ్లను చాంద్రాయణగుట్ట వారికి, ఫరూఖ్నగర్లో నిర్మించిన 500 ఇళ్లను బహదూర్పుర నియోజకవర్గం వారికి మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు.
బహదూర్పల్లిలో మంత్రి కేటీఆర్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలో ఇళ్ల పంపిణీ జరగనుంది. గాజులరామారంలోని 144, బహదూర్పల్లిలోని 356, డి-పోచంపల్లిలోని 1200 ఇళ్లను కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200మందికి, సనత్నగర్కు చెందిన 500మందికి, కూకట్పల్లికి చెందిన 500మందికి కలిపి మొత్తం 1700 మంది లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ అందజేస్తారు.
మంత్రి హరీశ్రావు..
పటాన్చెరు కొల్లూరు, అమీన్పూర్ ప్రాంతాల్లో పట్టాల పంపిణీలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. కొల్లూరులోని 1,500 ఇళ్లను ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 200 మందికి, జూబ్లీహిల్స్కు చెందిన 500 మందికి, శేరిలింగంపల్లికి చెందిన 156, రాజేంద్రనగర్కు చెందిన 144, పటాన్చెరుకు చెందిన 500 మందికి అందజేయనున్నారు. అమీన్పూర్లో నిర్మించిన 1800 గృహాలను గోషామహల్, నాంపల్లి, కార్వాన్ ప్రాంతాల నుంచి 500 చొప్పున, ఖైరతాబాద్లోని 300 మందికి పట్టాలను అందించనున్నారు.
- మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్ నియోజకవర్గం అహ్మద్గూడలోని 1500 ఇళ్లను 500ల చొప్పున మల్కాజ్గిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గం వారికి పంపిణీ చేయనున్నారు.
- గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి.. ఉప్పల్ శ్రీనగర్కాలనీలో నిర్మించిన 500 ఇళ్ల పట్టాలను అందజేస్తారు.
- ఉపసభాపతి పద్మారావుగౌడ్.. మేడ్చల్ నియోజకవర్గం ప్రతాప్ సింగారంలో నిర్మించిన 1000 ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
[ 01-05-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వంట ఆలస్యమైందని భార్య హత్య
[ 01-05-2024]
ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం నగరానికి వలసొచ్చిన ఆ కుటుంబం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటైంది. వంట ఆలస్యంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశానికి లోనైన భర్త ఇటుకతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
దివ్యాంగుడిని చితకబాది.. వృద్ధురాలిపై దాడి
[ 01-05-2024]
తన సెల్ఫోన్ను ఓ వ్యక్తి తీసుకొని తిరిగివ్వడంలేదని ఫిర్యాదు చేయడమే ఆ దివ్యాంగుడు చేసిన పాపం. రెండు కాళ్లు పనిచేయని అతడిని కానిస్టేబుల్ దారుణంగా చితకబాదాడు. తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన అతని తల్లినీ వదల్లేదు. -
నా ఒక్క ఓటే కదా... అనుకుంటే ఎలా?
[ 01-05-2024]
‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
[ 01-05-2024]
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు. -
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
[ 01-05-2024]
ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. -
మనోళ్లే పనోళ్లు.. బినామీ వసూళ్లు
[ 01-05-2024]
ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు. -
సుడిగాలిలా చుట్టి రావలె
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది. మొన్నటి వరకు పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఫలితాల్లో.. ‘పది’ పోయింది
[ 01-05-2024]
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు నిలబడ్డాయి. -
కాలు కదలాలంటే.. డబ్బులు చేతిలో పడాల్సిందే!
[ 01-05-2024]
ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో సభలు, సమావేశాలు, కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. -
ఎర్లీబర్డ్లో రూ.820 కోట్ల పన్ను వసూలు
[ 01-05-2024]
ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి నెలలోనే జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం దాదాపు 40శాతం ఆస్తిపన్నును వసూలు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రేటర్ పరిధిలో ఎర్లీబర్డ్ పథకం అమలైంది. -
డిటోనేటర్ పరిశ్రమలో భారీ పేలుడు: ఒకరి మృతి
[ 01-05-2024]
డిటోనేటర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగినా, పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుందని..మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడింది. -
కన్నడిగులపై కన్ను
[ 01-05-2024]
నగరంలోని కన్నడిగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అక్కడి నేతలను రంగంలోకి దించడానికి కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ ప్రచారం చేయాలని కర్ణాటక నేతలను టీపీసీసీ నాయకులు కోరుతున్నారు. -
రాజకీయక్షేత్రం సకుటుంబ రాజకీయ ప్రచారం
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు..అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సొంత బాణీతో ఆకట్టుకుంటున్నారు. -
కొండంత న్యాయం నావైపే
[ 01-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టుల సముదాయంలో న్యాయవాదులను కలిసి సహకారం అభ్యర్థించారు. -
భేషజాలు వద్దు.. సమన్వయంతో పనిచేయండి
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
బాబూజీ మార్గదర్శకాలు.. ఉజ్వల భవిష్యత్తుకు నాంది
[ 01-05-2024]
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
నాగన్పల్లి పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత
[ 01-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలోని రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉతీర్ణులయ్యారు. 2018 వరకు ఈ గ్రామంలో శిథిలమైన ఇరుకైన 4గదుల్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సాగేది. -
భారాస కథ ముగిసింది.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే: వీర్లపల్లి
[ 01-05-2024]
తెలంగాణలో భారాస కథ ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్కు తరలివస్తున్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఘనంగా స్వాగతిస్తామన్నారు. -
భాజపాతోనే రైతు సంక్షేమం: విశ్వేశ్వర్రెడ్డి
[ 01-05-2024]
భాజపాతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన భాజపా కిసాన్మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. -
కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం: కాంగ్రెస్
[ 01-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు. -
మళ్లీ నిరాశే..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా మళ్లీ అట్టడుగున నిలిచింది. గతేడాదిలాగే ఈసారీ 33వ స్థానంతో నిరాశ పరిచింది. గతేడాది కంటే ఉత్తీర్ణత 6 శాతం పెరగడం మాత్రం ఊరట కలిగించే అంశం. 2022-23 విద్యాసంవత్సరంలో 59.46 శాతం పాస్ కాగా.. ఈసారి(2023-24)లో 65.10 శాతం నమోదైందని సర్ది చెబుతున్నారు. -
మాదిగలు ఏ పార్టీలో ఉన్నా భాజపాకే ఓటేయండి: మందకృష్ణ
[ 01-05-2024]
-
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తేనే రాష్ట్రం సుభిక్షం
[ 01-05-2024]
మతతత్వ పార్టీల మాటలు నమ్మరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. -
ఐపీఎల్ ఒరవడి.. అభిమాన సందడి
[ 01-05-2024]
కొండాపూర్లోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో మంగళవారం ఐపీఎల్ క్రికెటర్లు సందడి చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్కుమార్రెడ్డి, ఉనద్కత్, నటరాజన్ విచ్చేసి అభిమానులతో ఉత్సాహంగా గడిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్