logo

ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి

ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి చెందింది. శుక్రవారం మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది.

Published : 10 May 2024 13:09 IST

మొయినాబాద్: ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి చెందింది. శుక్రవారం మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామానికి చెందిన శౌర్య(5), నాగిరెడ్డిగూడ రెవిన్యూలోని సుజాత స్కూలులో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులో చేరాడు. ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తూ నీట మునిగిపోయాడు. గమనించిన అక్కడి కోచ్ మునిగిన చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు