ప్రగతి పరుగు!
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పోరాటాన్ని సాగించిన ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి విషయంలో ప్రత్యేక ముద్ర కనిపిస్తోంది.. పథకాల ద్వారా అందిన సంక్షేమంతోపాటు ప్రత్యేకత నిలిపే అభివృద్ధి కూడా సాకారమైంది.
అభివృద్ధిలో ప్రత్యేక మార్కు
రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈనాడు, కరీంనగర్
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పోరాటాన్ని సాగించిన ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి విషయంలో ప్రత్యేక ముద్ర కనిపిస్తోంది.. పథకాల ద్వారా అందిన సంక్షేమంతోపాటు ప్రత్యేకత నిలిపే అభివృద్ధి కూడా సాకారమైంది.. సాగుకు దన్నుగా నిలిచేలా ప్రాజెక్టులు.. విద్యా రంగంలో తెలంగాణ మార్కు చూపించేలా కేజీ టు పీజీ ప్రాంగణంతోపాటు వైద్య సేవల మెరుగుకు వైద్య కళాశాలల ఏర్పాటు రాష్ట్ర ఆవిర్భావం తరవాత ఉమ్మడి జిల్లాకు వన్నె తెస్తున్నాయి.. రేపటి నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నాలుగు జిల్లాలు ముస్తాబైన నేపథ్యంలో ఇన్నాళ్లు దరిచేరిన అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం..
చదువుల అడ్డా.. ‘కేజీ టు పీజీ’.!
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టు పీజీ ప్రాంగణం
రాష్ట్రంలో కేజీ టు పీజీ హామీని నెరవేర్చేలా అక్షర ఖ్యాతిని అందించిన బడి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో నెరవేరింది. గత విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ అంగన్వాడీ నుంచి పీజీ విద్య వరకు చదువును అందించే విద్యానిలయంగా ఇది భాసిల్లుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ స్వప్నంగా పేరొందిన కేజీ టు పీజీ ప్రాంగణాన్ని చిన్నపాటి విశ్వవిద్యాలయాన్ని తలపించేలా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాంగణమిది. ఇక్కడ మొత్తంగా 2,500ల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు సంస్థలు చేసిన సాయం, ప్రభుత్వ నిధులు దాదాపుగా రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టి చూడచక్కని సౌకర్యాలు, వసతులతో ఆహ్లాదభరితమైన బడిగా నిర్మించారు. రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు వయస్సున్న వారికి అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో 12 గదుల్లో ప్రత్యేక బోధనను అందిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. జూనియర్, డిగ్రీ, పీజీలో పలు కోర్సులతోపాటు దూరవిద్యకోర్సులను అందుబాటులోకి తెచ్చారు. అతిపెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఒకేసారి 100 మంది కూర్చునే సౌకర్యాన్ని కల్పించారు. నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుట్టు మిషన్తోపాటు ఇతర కులవృత్తులకు చేయూతనిచ్చే సౌలభ్యాన్ని ఇక్కడి బడిలో అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్తు చదువుల లోకానికి దీన్ని ఒక నమూనాగా మార్చారు.
వైద్య కళాశాలలతో మేలు
రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేవిధంగా సర్కారు దవాఖానాలు ఇంతకింతకు బలోపేతమవుతున్నాయి. 9 ఏళ్లలో వైద్య చికిత్సల పరంగా ఊహించని సౌకర్యాలు, సౌలభ్యాలు రోగులకు చేరువయ్యాయి. ఈ సేవలకు అనుబంధంగా కొత్త వైద్య కళాశాలలు నాలుగు జిల్లాలకు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే కరీంనగర్, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలలను మంజూరు చేసి ఇక్కడి ప్రజల చిరకాల కోరికను తీర్చింది. బోధనేతర సిబ్బంది, వైద్య సిబ్బంది నియామకాలు జిల్లాల్లోని వైద్యసేవల్ని మరింత బలోపేతం చేయనున్నాయి.
జలకళనద్దిన కాళేశ్వరం
రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌజ్
ఎస్సారెస్పీ కాలువలు ఉన్న ప్రాంతం తప్పితే మిగతా చోట్ల సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఉమ్మడి కరీంనగర్లో సరికొత్త జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు కరవు కోరల్లో చివరి తడి నీటి కోసం ఆందోళనలు చేసిన గడ్డ.. ఇప్పుడు జలాశయాల ఖిల్లాగా మారిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగింది ఉమ్మడి జిల్లా పరిధిలోనే. రూ.లక్ష కోట్లతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు తొలి సాగునీటి ఫలాలు ఉమ్మడి జిల్లాకు అందాయి. మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం (సరస్వతి) బ్యారేజీ మీదుగా పెద్దపల్లి జిల్లా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్హౌజ్ల నుంచి ఎల్లంపల్లికి చేరుతుంది. అటు నుంచి నందిమేడారం, గాయత్రి పంప్ హౌజ్ మీదుగా మధ్యమానేరు జలాశయానికి వెళ్తాయి. సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని మంథని మండలం కాసిపేట శివారులో నిర్మించగా జలాశయంలో 8 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. సమీపంలోని గోలివాడ వద్ద నిర్మించిన పంప్హౌజ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు జలాశయం నిర్మాణం వేగంగా పూర్తి చేసుకుంది. నీటి సామర్థ్యం 25 టీఎంసీలు కాగా, ఈ జలాశయం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెరువులన్నింటిని నింపడంతో ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 2 లక్షల సాగుకు ఆధారమవుతోంది. రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌజ్ నుంచి వచ్చే నీటితో కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలకు కాళేశ్వరం తొలిఫలాలు అందాయి.
* 2017 వానాకాలంలో 6 లక్షల ఎకరాలు సాగైతే గత వానాకాలంలో కాళేశ్వరం జలాల పుణ్యమా అని దాదాపుగా 10లక్షల ఎకరాల్లో పలురకాల పంటల్ని రైతులు సాగుచేశారు.
* కాళేశ్వరం జలాలతో వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్)కు పునరుజ్జీవ పథకం ద్వారా నీళ్లను అందించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్, మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేటల వద్ద పంప్హౌజ్లను నిర్మించారు. వరద కాలువలోకి వీటి ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ను అవసరమున్నప్పుడు చేస్తున్నారు. దీని ద్వారా వరద కాలువలో అటు ఎస్సారెస్పీ ఇటు కాళేశ్వర జలాలు ఉండటంతో సమీప గ్రామాల ప్రజల సాగుకు ఇది జీవనాధారమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
[ 05-05-2024]
నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. -
ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
[ 05-05-2024]
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. -
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
[ 05-05-2024]
-
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
[ 05-05-2024]
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. -
ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి
[ 05-05-2024]
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్ను పరిశీలించారు. -
జగిత్యాలలో నేడు కేసీఆర్ రోడ్షో
[ 05-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. -
భానుడి భగభగలు!
[ 05-05-2024]
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. -
ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా
[ 05-05-2024]
‘కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. -
దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
[ 05-05-2024]
కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు. -
కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్
[ 05-05-2024]
ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్కుమార్కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. -
రిజర్వేషన్లను రక్షించుకుందాం
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. -
రూ.10.88 లక్షల నగదు పట్టివేత
[ 05-05-2024]
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి పరకాల అడ్డదారి చెక్పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. -
వీణవంకకు చేరుకున్న కేసీఆర్
[ 05-05-2024]
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
[ 05-05-2024]
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. -
భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా
[ 05-05-2024]
జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.