గోదావరి పరీవాహకం.. తీర్పులో విభిన్నం
1952లో ఆవిర్భవించిన మెట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో 12 సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగింది.
ముత్యంపేట చక్కెర కర్మాగారం
న్యూస్టుడే, కోరుట్ల: 1952లో ఆవిర్భవించిన మెట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో 12 సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగింది. 2009లో మెట్పల్లి నియోజకవర్గం రద్దయి కోరుట్ల నియోజకవర్గంగా ఆవిర్భవించింది. 2009 నుంచి 2018 వరకు కోరుట్ల శాసనసభకు 3 పర్యాయాలు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగింది. నియోజకవర్గం భౌగోళికపరంగా గోదావరి పరివాహక ప్రాంతం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రధాన కాలువ నియోజకవర్గంలోని నాలుగు మండలాల మీదుగా వెళ్తోంది. కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల, మెట్పల్లి రెండు రెవెన్యూ డివిజన్లు, పురపాలికలు ఉన్నాయి. కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగు భూమి ఉండగా, 51 వేల ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరందుతోంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల శివారు నుంచి గోదావరి నది ప్రవహిస్తుంది.
- మెట్పల్లి నియోజకవర్గం నుంచి 1967(స్వతంత్ర), 1972(కాంగ్రెస్) అభ్యర్థిగా చెన్నమనేని సత్యనారాయణరావు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు.
- 1978, 1983(కాంగ్రెస్)లో వర్తినేని వెంకటేశ్వరరావు రెండు పర్యాయాలు గెలుపొందారు.
- 1985, 1989, 1994(భాజపా)లో చెన్నమనేని విద్యాసాగర్రావు వరుసగా మూడు పర్యాయాలు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో భాజపా పక్ష నేతగా వ్యవహరించారు.
- 2009, 2010(ఉపఎన్నిక), 2014, 2018లో కోరుట్ల నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్రావు(తెరాస) వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పరిశ్రమ చుట్టూ రాజకీయాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట చక్కెర కర్మాగారం 1981-82లో నెలకొల్పారు. దశబ్దకాలం తర్వాత పరిశ్రమ సామర్థ్యాన్ని 1250 మెట్రిక్ టన్నుల నుంచి 2500 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు 1992-93లో యంత్రాల మరమ్మతు పనులను బిన్ని కంపెనీకి అప్పగించింది. తర్వాత క్రషింగ్ సామర్థ్యం పడిపోయి నష్టాలను మూటగట్టుకుంది. పరిశ్రమ పరిధిలో మొత్తం 70 వేల హెక్టార్లలో చెరకు పంట సాగు చేస్తుండేవారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం పరిశ్రమను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. 2009లో చక్కెర కర్మాగారం మూతపడింది. లేఆఫ్ కారణంగా 2015 డిసెంబరు 22న పరిశ్రమను మూసివేస్తున్నటు పరిశ్రమ ముందు నోటీస్ బోర్డుల్లో పేర్కొనడంతో రైతులు ఉపాధి కోల్పోగా, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. 2014, 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని హామీ నెరవేరలేదు. నియోజకవర్గంలో చక్కెర పరిశ్రమ చుట్టే రాజకీయం నెలకొంది. శాసనసభ ఎన్నికల్లో చక్కెర కర్మాగారం రాజకీయంగా కీలక అంశంగా మారనుంది.
చారిత్రక కట్టడాలు.. ఆలయాలు
కోరుట్ల పట్టణంలోని పురాతన గడి బురుజు
కోరుట్ల పట్టణంలో 11వ శతాబ్దంలో కట్టిన గడి బురుజులు, పురాతన కోనేరు ఉంది. పురాతన మహాదేవస్వామి దేవాలయం, వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 1375-1400 కాలంలో వేములవాడ దేవాలయం నిర్మించిన చాళుక్య వంశస్తులు కోరుట్ల మండలంలోని సంగెం గ్రామంలో శ్రీసంఘమేశ్వర ఆలయాన్ని రాతితో నిర్మించారు. నాగులపేట శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు 200 మీటర్ల పొడవున అరుదైన సైఫన్ నిర్మించారు.
1929లో మెట్పల్లి పాతబస్టాండ్ వద్ద 14 ఎకరాల్లో గాంధీ ప్రధాన శిష్యుడు అన్నసాహేబ్ సహస్రబుద్దే ఖాదీని నిర్మించారు. 1934 వరకు మహారాష్ట్ర బ్రాంచి కింద 1951లో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో కొనసాగింది. 1967లో మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్గా ఏర్పడి 1983 నుంచి ఖాదీ బోర్డు ఆధీనంలో పనిచేస్తుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, స్వామి రామానందతీర్థ, జువ్వాడి చొక్కారావు, హన్మంత్రావు, కల్వకుంట్ల వెంకటరాజేశ్వర్రావు ఖాదీబోర్డ్ ఛైర్మన్లుగా పని చేశారు. ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఖాదీ బోర్డు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఖాదీలో 600 మంది కార్మికులు, 50 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, బోధన్, కామారెడ్డిలోని ఖాదీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఏడాదికి రూ.3 కోట్ల టర్నోవర్తో కొనసాగుతుంది.
- మెట్పల్లిలో 2వేల సంవత్సరాల కిందట నిర్మించిన చెన్నకేశ్వరస్వామి దేవాలయం, పురాతన కోనేరు ఉంది.
- మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీకనకసోమేశ్వర దేవాలయం సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉంది. వాల్గొండ వద్ద పురాతన చరిత్ర త్రికూట ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.
- ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామశివారులో మిషన్ భగీరథ వాటర్ గ్రీడ్ను 2017-18లో ఏర్పాటు చేశారు. దానిపైన 35 కి.మీ దూరంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి డబ్బాకు ప్రత్యేక పైపులైన్ను ఏర్పాటు చేశారు. పైపులైన్ ద్వారా వచ్చే నీటిని గ్రీడ్లో శుద్ధి చేసి అక్కడి నుంచి జిల్లాలోని 18 మండలాలకు, 5 పురపాలికల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. * జిల్లా సరిహద్దులోని గండిహనుమాన్ దేవాలయం ప్రత్యేకత చాటుకుటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
[ 01-05-2024]
ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. -
లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ లక్ష్యం
[ 01-05-2024]
‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
పదిలో మెరుగైన ఫలితాలు
[ 01-05-2024]
జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. -
ఆ రెండు పార్టీలు ఒక్కటే
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, -
పదిలో ఎనిమిదో స్థానం
[ 01-05-2024]
జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం, -
పోలింగ్ కేంద్రం.. సమగ్ర సమాచారం
[ 01-05-2024]
ఓటర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు -
పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం
[ 01-05-2024]
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. -
ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన భాజపా, భారాసలు
[ 01-05-2024]
భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. -
మోదీ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు
[ 01-05-2024]
వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
పది ఫలితాల్లో అదుర్స్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. -
శ్రమజీవి గుండె సడి వినండి
[ 01-05-2024]
ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. -
గంజాయి చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
[ 01-05-2024]
పోలీసుస్టేషన్ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్ వివరాలు వెల్లడించారు. -
వాట్సాప్.. ఎన్నికలపై అప్డేట్
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది. -
68 మందిపై అనర్హత వేటు
[ 01-05-2024]
2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఏప్రిల్లో రూ.2.10 లక్షల కోట్లు
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!