నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది
స్మార్ట్సిటీ ప్రాజెక్టులో కనిపించని సాంకేతికత
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి
మూసేసిన కంప్యాక్టర్ స్టేషన్
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది. ప్రాజెక్టు అమలు చేయాల్సిన అధికారులు ఎవరికి వారు పట్టనట్లుగా ఉండటంతో వెచ్చించిన నిధులు నిరుపయోగంగా మారేలా కనిపిస్తోంది. కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రాధాన్యం కల్పించారు. చెత్త సేకరణ మొదలుకొని.. సేకరించిన చెత్తను తరలించడం వరకు పారిశుద్ధ్య పనులలో నూతన మార్పులు తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేసి నిధులు కేటాయించారు. దశల వారీగా టెండర్లు నిర్వహించిన స్మార్ట్సిటీ కన్సల్టెన్సీ, నగర పాలక అధికారులు అక్కడే ఆగిపోయారు. మరోవైపు ప్రతిరోజు టన్నుల కొద్ది వస్తున్న చెత్తను గుట్టలా పేర్చుకుంటూ వెళ్లడం తప్పా దానిని తగ్గించే ఆలోచన మాత్రం చేయడం లేదు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బయోమైనింగ్ రెండు అడుగులు వెనక్కి.. ఒక అడుగు ముందుకు అన్నట్లుగా మారింది.
సమయం వృథా అని..
హౌసింగ్బోర్డుకాలనీలో ఉన్న రిసోర్స్ పార్కులో ఏర్పాటు చేసిన కంప్యాక్టర్ స్టేషన్ మూత పడింది. 12 టన్నుల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. చెత్తను తగ్గించేందుకు రెండు భారీ వాహనాలు కొనుగోలు చేశారు. నగరంలోని చెత్తను తీసుకొచ్చి ఇందులో తగ్గిస్తారు. ఇందులో 180 టన్నుల చెత్తను 60 టన్నులకు తగ్గించి.. ఇక్కడి నుంచి డంపింగ్యార్డుకు తరలిస్తారు. నగరానికి డంపింగ్యార్డు దగ్గరగా ఉండటం, ఇక్కడ గంటల తరబడి వేచి ఉండటం సమయం వృథా అని నేరుగా చెత్తను యార్డుకే తరలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెండు ట్రక్కులు మూలన పడ్డాయి. షెడ్డులోపల తాళం వేసి పెట్టగా ఒకరోజు కూడా వాటిని బయటకు తీయడం లేదు. పైగా వాటికి రిజిస్ట్రేషన్ కూడా కానట్లు సమాచారం.
భూగర్భంలోనే చెత్త కుండీలు
రద్దీ ప్రాంతాల్లో చెత్తా చెదారం రోడ్లపై కనిపించకుండా నగరంలోని పది చోట్ల భూగర్భ స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేశారు. పలు చోట్ల వీటిని బిగించగా మరికొన్ని ప్రాంతాల్లో ఆ పనులు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. సెన్సార్ విధానంలో జీపీఎస్ అమలు చేస్తారు. ఒక్కొక్క డబ్బాలో ఏ మేర చెత్త నిండిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు శానిటేషన్ విభాగం అధికారికి, ఆ ప్రాంత డ్రైవర్కు చరవాణిలో సంక్షిప్త సమాచారం వస్తోంది.
ట్యాగులు.. జీపీఎస్ ట్రాకింగ్ ఏవీ?
నగర పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న 5,117 వాణిజ్య దుకాణాల నుంచి చెత్త సేకరణలో జాప్యం రాకుండా స్మార్ట్సిటీలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ (ఆర్ఎఫ్ఐడీ) బిగించారు. దుకాణాల ఎదుట నుంచి చెత్తను ఏ సమయంలో తీసుకెళ్తున్నారు.. ఎంత చెత్త వెళ్తుంది? చెత్త తీసుకెళ్లిన తర్వాత తెలిసేలా దీనిని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయనున్నారు. రీడర్స్ ఇవ్వకపోవడం, చెత్తను సేకరించే వాహనాల డ్రైవర్లకు స్కానింగ్ పరికరాల కొనుగోలులో జాప్యం చేస్తున్నారు. దాంతో ట్యాగ్స్ ఉన్నా వినియోగం లేకుండా పోతున్నాయి
నిధుల కేటాయింపులు ఇలా..
రూ.1.43 కోట్లతో షెడ్డుతో పాటు కంప్యాక్టర్ స్టేషన్ నిర్మాణం
రూ.1.63 కోట్లతో మాడ్రన్ స్మార్ట్బిన్స్ ఏర్పాటు పనులు
రూ.16.14 కోట్లతో బయోమైనింగ్ ద్వారా చెత్త శుద్ధీకరణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం