అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు.
కాజీపేట-బల్లార్షా సెక్షన్ ప్రాధాన్యం పెంచితేనే మేలు
స్టేషన్లలో వసతులు, హాల్టింగులపై ద.మ.రై. నిర్లక్ష్యం
న్యూస్టుడే, పెద్దపల్లి
- వైజాగ్ నుంచి కరీంనగర్కు కనెక్టివిటీ కోసం విశాఖ నుంచి శిరిడీ వెళ్లే సాయినగర్ ఎక్స్ప్రెస్ను కాజీపేట, కరీంనగర్ మీదుగా నడిపించాలని విశాఖ ఎంపీ ఒకరు గతంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విన్నవించారు.
- కేరళ ఎక్స్ప్రెస్కు ఆ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ ఎక్స్ప్రెస్ను ఇక్కడి అన్ని ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. స్టేషన్లో వసతులు, రైళ్ల హాల్టింగులకు అక్కడి ఆదాయం, ప్రయాణికుల సంఖ్య ప్రామాణికంగా తీసుకోవాలి. కాగా ఇవేవీ రైల్వే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడూ గుడ్డి పోకడతోనే రైల్వే వ్యవస్థను నియంత్రిస్తున్నారు.
సాధారణ రోజుల్లోనూ అలా నడిపిస్తే..
ద.మ.రై. హోలీ ప్రత్యేక రైళ్లను కొన్నింటిని కాజీపేట, బల్లార్షా మీదుగా కోల్కతాకు నడిపిస్తుంది. సికింద్రాబాద్ నుంచి కోల్కతాకు పదికి పైగా రైళ్లున్నాయి. వీటిలో ఒక్కటి మాత్రం నడికుడి మార్గంలో విజయవాడ మీదుగా వెళ్తుండగా మిగిలిన రైళ్లన్నీ కాజీపేట, విజయవాడ మీదుగానే కోల్కతాకు నడిపిస్తున్నారు. తాజాగా హోలీ ప్రత్యేక రైళ్లను కాజీపేట, బల్లార్షా మీదుగా నడిపిస్తుండటంతో రెగ్యులర్ రైళ్లలోనూ కొన్నింటిని ఈ మార్గంలో నడిపించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లావాసులు ఒడిశాతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవాలంటే కాజీపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కాజీపేట-బల్లార్ష్షా సెక్షన్లో ఒకటి రెండు రైళ్లను నడిపితే కోల్కతాకు కేవలం 40 కిలోమీటర్ల దూరం పెరిగినా పారిశ్రామిక ప్రాంతాలైన బల్లార్షా, గోండియా, దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, ఝాన్సీగూడ, రూర్కెలా, టాటానగర్, ఖరగ్పూర్లకు ఉమ్మడి జిల్లా నుంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది.
కేరళను చూసి నేర్చుకోవాలి
దక్షిణాదిన చిన్న రాష్ట్రమైన కేరళలో తిరువనంతపురం నుంచి దిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ ఆ రాష్ట్రంలోని 14 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో 5 జిల్లాకేంద్రాలుండగా మిగిలినవి చిన్న స్టేషన్లు. విశాఖపట్నం నుంచి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్కు సైతం ఆంధ్రప్రదేశ్లో 7, తెలంగాణలో 5 హాల్టింగులున్నాయి. మన తెలంగాణ ఎక్స్ప్రెస్కు 6 హాల్టింగులున్నాయి. జిల్లాకేంద్రాలైన భువనగిరి, జనగామ, పెద్దపల్లి పట్టణాల్లో మాత్రం హాల్టింగులు ఇవ్వలేదు. కానీ రైల్వే అధికారుల లాబీయింగ్తో పక్కపక్కనే రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలకు మూడు హాల్టింగులిచ్చారు. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి దిల్లీ వైపు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్లకు మన రాష్ట్రంలోనే హాల్టింగులు సాధించడంలో ప్రజాప్రతినిధులు తరచూ విఫలమవుతున్నారు. ఇక తమిళనాడు నుంచి వచ్చే రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు కనీస చర్యలు కూడా ఉండటం లేదు. ఇటీవల దక్షిణ రైల్వే ప్రవేశపెట్టిన రామేశ్వరం, కాశీ తమిళ సంఘం ఎక్స్ప్రెస్కు వరంగల్, బల్లార్షా మధ్య ఒక్క హాల్టింగ్ కూడా సాధించలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి