logo

ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎవరినీ వదిలేది లేదు

రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్‌ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 19 Apr 2024 04:14 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం

కరీంనగర్‌ పట్టణం, రాంనగర్‌ న్యూస్‌టుడే: రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్‌ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో మానకొండూరు, చొప్పదండి శాసన సభ్యులు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, వాకర్స్‌తో కలిసి ఆయన వాకింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.. రాముడు అందరివాడని, నిత్యం కొలుస్తామని తానెప్పుడు రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడం ఆయన పిచ్చితనానికి నిదర్శనమన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ రోజుకో రకమైన ప్రకటన చేస్తున్నారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. భాజపా, భారాస రెండు పార్టీలు ఒకటేనని ఈ పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్లు భాజపా ప్రభుత్వానికి అందితే ఆ డబ్బు న్యాయబద్ధంగా ఎలా మారుతుందని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు