అవగాహన లేక.. అందని ఉచిత కరెంటు
దళిత, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా తమ నివాసాల్లో వినియోగించే విద్యుత్తుపైనా రాయితీ అందిస్తోంది.
దళిత, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా తమ నివాసాల్లో వినియోగించే విద్యుత్తుపైనా రాయితీ అందిస్తోంది. ఇందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరూ తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సదరు విద్యుత్తు శాఖ అధికారికి సమర్పించాల్సి ఉంది. కానీ ఏళ్లు గడుస్తున్నా నూరు శాతం వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించలేకపోయారు. అవగాహన లేక అనేక మంది అర్హులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని కోల్పోతున్నారు. అవగాహన కల్పించడంలోనూ విద్యుత్తు సిబ్బంది విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూనిట్ల లోపు..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్తు సరఫరాను అందిస్తోంది. అలాగే దళిత, గిరిజన కుటుంబాల గృహాల్లో నెలకు 50 యూనిట్లలోపు వినియోగించే వారికి రాయితీని అందిస్తున్నారు. దీనిని సమీక్షించిన ప్రభుత్వం 2018 ఆగస్టు 24న 101 యూనిట్లకు ఈ ఉచిత పథకాన్ని పెంచింది. అంటే 101 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తే పూర్తిగా ఉచితం. కానీ 102 యూనిట్లు వాడుకుంటే మాత్రం పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అనేక పేద కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ధ్రువీకరణలు ఇవ్వక..
జిల్లాలో ప్రస్తుతం 62,661 మంది ఎస్సీ, 39,069మంది ఎస్టీ మొత్తంగా 1,01,730 గృహ విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 42,550 మంది ఎస్సీలు, 25,058 మంది ఎస్టీలు మొత్తంగా 67,608(66.45%) మంది తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. పథకం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇంకా 20,111 మంది ఎస్సీలు, 14,011 మంది ఎస్టీలు మొత్తంగా 34,122(33.54%) మంది తమ ధ్రువీకరణ పత్రాలు నేటికీ అధికారులకు సమర్పించలేదు.
ప్రచార లోపం
సాధారణంగా పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. విద్యుత్తు రాయితీలపై ప్రజలకు సరైన అవగాహన కార్యక్రమాలు జరగడంలేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో, అధికారిక సభల్లో రాయితీపై విద్యుత్తు అధికారులు ప్రచారం చేస్తే ప్రజలకు అవగాహన కలుగుతుంది. ధ్రువీకరణ పత్రాల ఆలస్యంపై సంస్థ సీఎండీ సైతం జిల్లా కలెక్టర్లకు ఇటీవలే సహకరించాలంటూ ఉత్తరాలు రాశారు. జిల్లా అధికారులు ఏ స్థాయిలో స్పందిస్తారో వేచి చూడాలి.
* ఈ పథకం వర్తించాలంటే గృహ వినియోగదారులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సర్వీసుకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. తమ ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక ఏఈలకు అందించి ఈ ఉచితాన్ని పొందవచ్ఛు ఉద్యోగులు, రూ.కోట్ల ఆదాయం ఉన్నా అర్హులే.
ధ్రువీకరణ ఇవ్వాల్సినవారు
* సత్తుపల్లి డివిజను: 13,582(48.92%)
* ఖమ్మం టౌన్: 9,820(33.45%)
* ఖమ్మంగ్రామీణం: 6,162(24.63%)
* వైరా డివిజను: 4,558 (23.24%)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసగించారు: జేపీ నడ్డా
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ నంబర్ వన్ అవుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
కరుగుతున్న గుట్టలు
[ 06-05-2024]
జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది. -
వేసవి తాపం.. మారిన షిఫ్ట్ సమయం
[ 06-05-2024]
సింగరేణి ఉపరితల గనుల్లో షిఫ్ట్ వేళలు మారాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, రెండో షిఫ్ట్ సమయాల్లో యాజమాన్యం మార్పులు చేసింది. -
అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ను గెలిపించండి: తుమ్మల
[ 06-05-2024]
తాను మంత్రిగా గతంలో కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తా: నామా
[ 06-05-2024]
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన: మంత్రి పొంగులేటి
[ 06-05-2024]
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
భాజపాలో పలువురి చేరిక
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, హామీలు నెరవేర్చక కాంగ్రెస్ పని ఖతమయ్యిందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం’
[ 06-05-2024]
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, పూల రవీందర్ పిలుపునిచ్చారు. -
గాలివాన బీభత్సంతో గాఢాంధకారం
[ 06-05-2024]
ఈదురుగాలులు, పిడుగులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. -
బ్రహ్మోత్సవాల రాబడి.. తేలేదెప్పుడండీ..?
[ 06-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు. -
వాడి తగ్గని దండా
[ 06-05-2024]
ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్ట్, లెనినిస్ట్)(యూసీసీఆర్ఐ-ఎంఎల్) ఖమ్మం లోక్సభ అభ్యర్థి దండా లింగయ్య. -
భారాస గెలిస్తేనే రాష్ట్రానికి మేలు
[ 06-05-2024]
భారాస కార్యకర్తల కృషి, ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో తాను మరోసారి విజయం సాధిస్తానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
అతివల చేతిలో ఓటు చైతన్యం
[ 06-05-2024]
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఓటరు చైతన్యంపై వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కోడి ధరకు రెక్కలు
[ 06-05-2024]
వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. -
బాలికలే సాధకులు
[ 06-05-2024]
తల్లిదండ్రులు బాలురతో సమానంగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాలికలున్నా వేసవి సెలవుల్లో వారిని వెన్నుతట్టి నడిపిస్తున్నారు. -
వైభవంగా రాములోరికి అభిషేకం
[ 06-05-2024]
భద్రాచలం రామాలయ క్యూలైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన కోవెలలో అర్చకులు సుప్రభాత సేవ చేసి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. -
7న సినీ నటుడు వెంకటేశ్ రాక
[ 06-05-2024]
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఈనెల 7న ఖమ్మం రానున్నట్లు ప్రోగ్రాం సమన్వయకర్త తుంబూరు దయాకర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దంపతులను బలిగొన్న టిప్పర్
[ 06-05-2024]
టిప్పర్ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు