ఆ విజయం వెనక..
ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించి కార్పొరేట్ కొలువుల్లో పనిచేస్తూ చాలామంది ఆ ఉద్యోగాల్ని వదులుకుని సివిల్స్కు సన్నద్ధమవుతున్నారు.. కానీ ఈ యువతి చదువు విషయంలో ఆదిలోనే లక్ష్య నిర్దేశన చేసుకుంది.
సివిల్స్లో జాతీయ స్థాయిలో 938వ ర్యాంకు సాధించిన యువతి
తల్లిదండ్రులతో సాయి అలేఖ్య
మధిర పట్టణం, బోనకల్లు, న్యూస్టుడే: ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించి కార్పొరేట్ కొలువుల్లో పనిచేస్తూ చాలామంది ఆ ఉద్యోగాల్ని వదులుకుని సివిల్స్కు సన్నద్ధమవుతున్నారు.. కానీ ఈ యువతి చదువు విషయంలో ఆదిలోనే లక్ష్య నిర్దేశన చేసుకుంది. చదివిన విద్య, సాధించే కొలువు ప్రజా జీవితాలకు మేలు చేసేలా ఉండాలన్నది తన ఉద్దేశం. ప్రజా సంబంధాలే తాను చేసే కొలువు పరమావధి కావాలన్నది ఆలోచన. స్వాతంత్య్ర సమరయోధుడైన తాతయ్యను స్ఫూర్తిగా తీసుకుని, అనుకున్నది సాధించే క్రమంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఓపిగ్గా అడుగులు వేశారు. యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో బోనకల్లు మండలం ఎల్.గోవిందాపురానికి చెందిన రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు సాధించారు.
రావూరి ప్రకాష్రావు, పద్మశ్రీల ఏకైక సంతానం సాయి అలేఖ్య. తండ్రి మధిర పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అలేఖ్య ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్ శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ రూరల్ డెవలప్మెంట్ కోర్సు పూర్తి చేసింది. ఇందులో బంగారు పతకం సాధించింది. అనంతరం హైదరాబాద్లోని సీఎస్బీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుని మూడుసార్లు ప్రిలిమినరీ దశలోనే విఫలమైంది. నాలుగో పర్యాయం మెయిన్స్లో నిరాశ ఎదురైంది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఐదో పర్యాయం 938వ ర్యాంకు సాధించారు.
ఐఏఎస్ సాధనే లక్ష్యం..: అలేఖ్య
ప్రస్తుత ర్యాంకుతో ఐపీఎస్ వస్తుందని భావిస్తున్నా. కానీ ఐఏఎస్ ద్వారా ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా మరోమారు ప్రయత్నిస్తా. తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారు. తాతయ్య రావూరి వెంకటరామయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. పేదల పక్షాన పనిచేసిన ఆయన పోరాట స్ఫూర్తి నన్ను చిన్నతనం నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించింది. ప్రజాసేవ చేసేందుకు నన్ను ఉన్నత స్థానంలో చూడాలని తపించేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుడికి ఆర్థిక సహాయం
[ 29-04-2024]
కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. -
భారాస హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతే: జేపీ నడ్డా
[ 29-04-2024]
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత
[ 29-04-2024]
ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. -
మూడు నెలలు ముహూర్తాలే లేవు!
[ 29-04-2024]
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. -
ప్రచారం ఉద్ధృతం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
[ 29-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి
[ 29-04-2024]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?
[ 29-04-2024]
వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. -
3న నామినేషన్ వేస్తా: తీన్మార్ మల్లన్న
[ 29-04-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఖమ్మంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు
[ 29-04-2024]
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. -
బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
[ 29-04-2024]
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!
[ 29-04-2024]
రెండు లోక్సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. -
టీటీలో జిల్లా మేటి!
[ 29-04-2024]
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. -
కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
[ 29-04-2024]
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. -
ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
[ 29-04-2024]
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
[ 29-04-2024]
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!