YS Jagan: జనాలకు జగన్ ఏప్రిల్ ఫూల్
‘‘జగన్ ఏలుబడిలో ఏప్రిల్ ఫస్టు ఒక్కటే కాదు.. ‘ఆల్ ఫూల్స్ డే’.. వైకాపా జమానాలో ‘అక్షరాలా’ అనునిత్యం అమలవుతోంది. ఏప్రిల్ మొదటి తారీఖున నమ్మిన నలుగురిని ఫూల్ చేసి గొప్పగా ఫీలవుతారు పిల్లలు.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాటు నిత్యం ప్రజలను పిచ్చోళ్లను చేస్తూనే ఉన్నారు.
మాటలతో ముగిసిన మూడు రోజుల పర్యటన
పెండింగ్ ప్రాజెక్టులపై నోరెత్తని ముఖ్యమంత్రి
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం
‘‘జగన్ ఏలుబడిలో ఏప్రిల్ ఫస్టు ఒక్కటే కాదు.. ‘ఆల్ ఫూల్స్ డే’.. వైకాపా జమానాలో ‘అక్షరాలా’ అనునిత్యం అమలవుతోంది. ఏప్రిల్ మొదటి తారీఖున నమ్మిన నలుగురిని ఫూల్ చేసి గొప్పగా ఫీలవుతారు పిల్లలు.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాటు నిత్యం ప్రజలను పిచ్చోళ్లను చేస్తూనే ఉన్నారు. రాజకీయమంటే ‘పిల్లలాట’ అని అర్థం చేసుకున్నట్లున్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చేసిన హామీల్లో 99 శాతం నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు. తొంభై తొమ్మిది శాతమంటే ఎంతో ఆయనకు ఏ ‘ఇస్కూల్లో’ నేర్పించారో మనకు తెలియదుగానీ.. చేసింది చూస్తే మాత్రం ఆయన మాటలు కోటలు దాటుతున్నాయని అర్థమవుతోంది. జనానికి ఆయన చేసిన ‘సాయం తక్కువ.. మాయ ఎక్కువ’ అన్నది సారాంశం. ఘోరమేమిటంటే ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి.. నవరత్నాల ముసుగు వేసి బటన్ నొక్కి బాదేశారు. ఐదేళ్లుగా అన్నివర్గాలను ఇబ్బంది పెడుతూ.. ఎన్నికల ముందు మూడు రోజులు ప్రచార యాత్రలో తిరిగి జగన్ ఏ‘మార్చి’ వెళ్లారు.. జనాలను ఏప్రిల్ ఫూల్ చేశారు!
ధనవంతుడి నోట పేద పలుకులు
తాను ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్మేస్తారన్న భ్రమలో ఉన్న జగన్... పశ్చిమాన పచ్చి అబద్ధాలు ఆడారు.. తమ పార్టీ అభ్యర్థులు పేదలంటూ ప్రచార సభలో పేర్కొనడంతో జనం ముక్కున వేలేసుకున్నారు. వారంతా రూ.కోట్ల ధనికులు.. తమకు అడ్డొచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేస్తారు.. అలాంటివారు పేదవారట.. పైగా మంచివాళ్లు, సౌమ్యులూనట. అందరి చెవిలో జగన్ పువ్వులు పెడుతున్నారంటూ జనాలు వ్యాఖ్యానించడం గమనార్హం. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ పదేపదే చెప్పుకొంటూ వారిని నిండా ముంచారు. ‘గాలి’ బలహీనంగా ఉందంటూ బీసీలైన ఓ మంత్రి, ఓ ఎంపీకి టికెట్ ఇవ్వలేదు. ఇద్దరు ఎస్సీలు, ఓ మైనార్టీ ఎమ్మెల్యేలను పక్కనపెట్టారు.. తన సామాజిక వర్గానికి చెందిన ఒక్కరినీ మార్చలేదు.. ఇదేనా సామాజిక న్యాయమంటూ ప్రశ్నిస్తున్నారు.
కాలు కదపలేదు.. హామీ ఇవ్వలేదు
‘మేమంతా సిద్ధం’ పేరిట జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత మూడు రోజులుగా 14 పల్లెల మీదుగా 46 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించారు. నంద్యాల, ఎమ్మిగనూరులో బహిరంగ సభ పెట్టారు. బస్సులు మళ్లించారు.. బీరు సీసాలిచ్చారు.. బిర్యానీ తినిపించారు.. డబ్బులు పంచారు.. దండిగా జనాలంటూ ‘గ్రాఫిక్స్’ చేశారు. ప్రచార సభలో జగన్ పాత కథ వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోయారు. 2019 ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లాలో 18 రోజులపాటు 260 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పుడేమో కాలు కదపకుండా.. ఏసీ బస్సులో కూర్చొని పల్లెల మీదుగా బస్సు యాత్ర కొనసాగించారు. బస్సుపై నుంచే చేతులు ఊపుతూ ముందుకెళ్లారు. బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారింది. ఎక్కడా ఒక్క హామీ ఇవ్వలేదని, గెలిస్తే ఏం చేస్తామో జగన్రెడ్డి చెప్పడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
పరదాల మధ్య భజన
జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ప్రముఖులతో ముఖాముఖి ఉంటుంది. ‘సలహా’లు స్వీకరిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టారు. ఏసీ బస్సులో వచ్చారు.. ఐప్యాక్, వైకాపా నేతలు ముందస్తుగా సిద్ధం చేసిన భ‘జన’ పరులను కూర్చోబెట్టారు. శిరివెళ్ల, తుగ్గలిలో భజన బృందంతో జగన్నాటకాన్ని రక్తికట్టించారు. తుగ్గలిలో కొందరు స్థానికులు సంధించిన ప్రశ్నలతో జగన్కు దిమ్మతిరిగింది. ప్రజలతో ముఖాముఖి అని చెప్పి చుట్టూ పరదాలతోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. టోకెన్ ఉంటే తప్ప అనుమతి ఇవ్వలేదు.
ఏకరవు పెట్టినా వినిపించుకోలే
ముఖ్యమంత్రి హోదాలో బందో‘మస్తు’ నడుమ వచ్చారు.. పరదాల్లో వెళ్లి తనదైన శైలిలో చేతులూపి పథకాల బాకా ఊది వెళ్లిపోయేవారు. ‘రాజు’గారు వస్తున్నారంటే భజన యంత్రాంగం పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేసేది.. భద్రత పేరుతో ఆయా ప్రాంతాలను అష్ట దిగ్బంధనం చేసేది. జగన్కో దండం.. వచ్చారంటే గండం అంటూ జనం నరకం అనుభవించారు. ప్రచార యాత్రకు బస్సులో వచ్చిన ఆయనకు జనం ఏ‘కరవు’ పెట్టినా వినిపించుకోవడానికి ‘సిద్ధం’గా లేరు. జొన్నగిరి శివారులోని బీసీ కాలనీ వద్దకు సీఎం బస్సు రాగానే.. పెద్ద ఎత్తున కాలనీవాసులు అక్కడికి చేరుకున్నారు. ‘తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం... మా సమస్యను పరిష్కరించండి’, ‘జొన్నగిరి చెరువును నింపండి’ అని నినదించారు. నీటి సమస్యను ముఖ్యమంత్రికి చెప్పేందుకు కొత్తూరు గ్రామస్థులు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. రెండు చోట్లా తలూపారు తప్ప సరైన సమాధానం చెప్పలేదు.
అన్నీ అబద్ధాలే
నగర శివారు జగన్నాథగట్టుపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి మార్చి 14న ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. రెండు వారాల్లోనే ఆయన మాట మార్చేశారు. గత నెల 28న నంద్యాల జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో మాట్లాడుతూ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసినట్లు పేర్కొనడం గమనార్హం.. రైతు మొదలు, మహిళలు, యువత, ఇలా ప్రతి ఒక్కరినీ మాయమాటలతో ప్రచార సభలో హోరెత్తించారు. నవరత్నాల్లో భాగంగా ఇళ్లు కాదు.. ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని జగన్ గొప్పలు చెప్పారు. ఇప్పటివరకు కేవలం 7-8 వేల ఇళ్లు నిర్మించలేదు.
ఐదేళ్లు బాదేశారు
జగన్ ఏలుబడిలో ఆయన అనుచరులు షడ్రసోపేతమైన ధనవిందు భోజనాలు చేసుకున్నారు. ప్రజా ఆస్తులను నంజుకుతిన్నారు. ఇది ఒక రంగంలోనే కాదు. ఏ రంగంలో పడితే ఆ రంగంలో ‘బడితె’ పట్టుకున్న వీరంగం పెరిగిపోయింది. వాళ్లు ఆస్తులు పెంచుకున్నారు.. ప్రజలపై బాదుడు విధించారు. పట్టణాల్లో ఏటా పదిశాతం ఆస్తి పన్ను పెంచారు.ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. భూముల విలువ పెంచుతూ రూ.150 కోట్ల భారం వేశారు.
గతేడాది సెప్టెంబరు 19న కృష్ణగిరి మండలం ఆలంకొండ పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నీటి విడుదల సందర్భంగా చెప్పిన మాటలన్నీ ‘నీటి’ మూటలయ్యాయి. ఆరు నెలల పాటు హంద్రీనీవా కాల్వలో నీటి ప్రవాహం కొనసాగింది. అయినా ఒక్క చెరువులోకీ నీరు చేరలేదు. పనులు పూర్తి చేయకుండానే ప్రచారం కోసం బటన్ నొక్కారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షాలు సమృద్ధిగా కురవాలని సప్తభజనలు
[ 29-04-2024]
మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఖరీఫ్, రబీ సీజన్లలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సప్త భజనలు నిర్వహిస్తున్నారు. -
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
[ 29-04-2024]
పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెదేపా అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్రెడ్డి అన్నారు. -
గూడ్స్ బోగిలో మంటలు
[ 29-04-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్లో ఆదివారం గూడ్స్ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. -
జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం
[ 29-04-2024]
పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. -
వైకాపాలో రగడ
[ 29-04-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్ రుద్రగౌడ్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. -
జగన్ పాలన.. కష్టాల‘పాలు’
[ 29-04-2024]
చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. -
పశ్చిమాన వలస విలాపం
[ 29-04-2024]
పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. -
విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
[ 29-04-2024]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. -
జగన్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
[ 29-04-2024]
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
అరాచక పాలనకు అంతం తప్పదు
[ 29-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు
[ 29-04-2024]
విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. -
వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
[ 29-04-2024]
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం
[ 29-04-2024]
ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్కు ఆవుకు పోలీస్స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్కు వచ్చారు. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ
[ 29-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్, శివనందినగర్లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. -
కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
[ 29-04-2024]
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..