logo

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆదోనిలో ఎన్నికల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు, నామినేషన్  కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పరిశీలించారు.

Published : 17 Apr 2024 19:29 IST

ఆదోని మార్కెట్: ఆదోనిలో ఎన్నికల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు, నామినేషన్  కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, పోలీసు బలగాలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు తెలిపారు. డీఎస్పీ శివ నారాయణస్వామి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస రెడ్డి, ఆదోని పట్టణ సీఐ నిరంజన రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని