జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.
సాయం అందక అయోమయం
విద్యార్థులకు రిక్తహస్తం
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. చదువు మధ్యలో మానేయలేక.. చదివేందుకు ఆర్థిక భారం మోయలేక.. ఇబ్బందులు పడుతున్నారు. విద్యా దీవెన అందక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారి ఆవేదన ఇది.
సొంతంగా ఫీజు చెల్లిస్తున్నాం
- వివేకానంద, ఎమ్ఎల్టీ విద్యార్థి, వెల్దుర్తి
వెల్దుర్తి, న్యూస్టుడే: కర్నూలులోని ప్రైవేటు కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చేస్తున్నా. ఇందుకోసం ఏడాది రూ.25వేల మేర ఫీజులు చెల్లిస్తున్నాం. విద్యాదీవెన వస్తుందని ఎంతో నమ్మకం ఉండేది. కానీ అందలేదు. దీంతో నాతో పాటు, నా సోదరి కళాశాల ఫీజు సైతం సొంతంగా చెల్లిస్తున్నాం. విద్యాదీవెన రాకపోవడంతో ఏటా ఇద్దరం రూ.50వేల మేర ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో చదువుకోవడం ఆర్థిక భారం అవుతోంది.
మూడేళ్లకు రూ.10 వేలే
- మనోహర్, ఆలూరు
ఆలూరు, న్యూస్టుడే: మాది దేవనకొండ మండలం భైరవ కుంట. ఆలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తిచేశా. కళాశాలలో చదివే విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం విద్యా దీవెన కింద ఏటా రూ.20 వేలు అందిస్తామని చెప్పింది. ఈ మూడేళ్లలో కేవలం రూ.10 వేలే అందింది. ఈ ఏడాది ఒక్క రూపాయి అందలేదు. దీంతో తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఆలూరులోనే ఉంటూ ఖాళీ సమయంలో పని చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది.
మీట నొక్కినా..
- మక్తూంబాషా, డిగ్రీ విద్యార్థి, పత్తికొండ
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తవుతున్నా.. విద్యా దీవెన డబ్బులు ఇంత వరకు ఖాతాలో జమ కాలేదు. ప్రస్తుతం మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించాలని కళాశాల అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులేమో రాలేదు. మొదటి సంవత్సరం కళాశాల, పరీక్ష ఫీజులు మొత్తం కలిపి రూ.8వేలకు పైగా చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే పరీక్షలు రాసేందుకు అనుమతించమని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది చెబుతున్నారు.
కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది
- బి.రుద్రప్ప, చిరుద్యోగి, ఆదోని పట్టణం
నా కుమారుడు వినయ్కుమార్ బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. విద్యాదీవెన గత ఏడాదిగా మా ఖాతాలో జమ కాలేదు. మరోవైపు కళాశాల నిర్వాహకులు మాత్రం కళాశాల ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. కళాశాలకు రూ.36,500 ఫీజు చెల్లించాల్సి ఉంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. కళాశాలకు ఫీజులు చెల్లిస్తేనే నా కుమారుడి సర్టిపికెట్లు మొత్తం అందుతాయి. ప్రభుత్వం బకాయి ఉన్న విద్యాదీవెన ఖాతాలో జమ చేస్తే మేలు.
ఇంత వరకు అందలేదు..
- గాదిలింగ, హొళగుంద
హొళగుంద, న్యూస్టుడే: వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. మా నాన్న గారి పేరు మీద 1.50 ఎకరా స్థలం ఉంది. మధ్యతరగతి కుటుంబం. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు బీరప్పను సత్యసాయి జిల్లాలో పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చరల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫీˆజు రూ.35వేలు చెల్లించా. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. సచివాలయంలో విచారణ చేయగా.. వస్తుందని చెబుతున్నారు. ప్రతి నెలా మెస్ ఫీజు రూ.4వేలు అదనపు భారంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి రావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటర్ చైతన్య ర్యాలీ
[ 30-04-2024]
ఆదోని పట్టణంలో మంగళవారం ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. -
అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు
[ 30-04-2024]
మే 5న కర్నూలు డీఎస్సీ స్టేడియంలో అండర్ 19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. -
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు. -
ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే..
[ 30-04-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు. -
ముస్లింలకు జగన్ ధోకా
[ 30-04-2024]
తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. -
పండుటాకులతో జగన్ పింఛనాట
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. -
జలం కోసం జనం ఆందోళన
[ 30-04-2024]
మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
అసెంబ్లీ బరిలో 126 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు నిలిచారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 31 మంది పోటీలో ఉన్నారు. -
పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి
[ 30-04-2024]
మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. -
1 వరకు దరఖాస్తుకు గడువు
[ 30-04-2024]
ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. -
రాక్షస పాలనను తరిమేద్దాం
[ 30-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
[ 30-04-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. -
స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ టంబ్లర్ గుర్తు
[ 30-04-2024]
కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్.ఎన్కు అధికారులు గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించారు. -
ఫైనాన్స్ సంస్థకు మొట్టికాయ
[ 30-04-2024]
నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. -
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.