ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు.
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఈనాడు, నంద్యాల : రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారులు ప్రకటన విడుదల చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న పోలింగ్ జరగనుంది. 24 రోజుల పాటు ప్రచారం హోరెత్తనుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇప్పటికే పల్లెబాట పట్టారు. నామపత్రాల దాఖలు రోజున పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. కొందరు అభ్యర్థులు మొదటి సెట్ నామపత్రాలను లాంఛనంగా సమర్పించి... రెండో సెట్ పత్రాలను భారీ ర్యాలీతో వెళ్లి దాఖలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొంటున్నారు.
- నంద్యాల పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. డోన్, ఆళ్లగడ్డ, బనగానపల్లి, నందికొట్కూరు పట్టణాల్లోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ నామపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీశైలం నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయాన్ని ఆత్మకూరులో ఏర్పాటుచేశారు.
- కర్నూలు ఎంపీ అభ్యర్థులు తమ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్కు అందించాలి. కర్నూలు, కోడుమూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కర్నూలులోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోనూ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరులో ఏర్పాటుచేసిన ఆర్వో కార్యాలయాల్లోని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు నామపత్రాలు అందించాల్సి ఉంటుంది.
రాశి కలవాలి.. విజయం చేకూరాలి
మహానంది, న్యూస్టుడే: అభ్యర్థులు తమ జన్మ, నామ నక్షత్రాలు, రాశి, వాసి చూసుకొని నామపత్రాల దాఖలుకు ముహూర్తం చూసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే పురోహితులు, పండితులు, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఏ రోజైనప్పటికీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ‘అభిజిత్ లగ్నం’ అందరికీ మేలు, విజయం చేకూర్చుతుందని పండితులు చెబుతున్నారు.
- ఈనెల 18న దశమి తిథి, మఖ నక్షత్రం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 19న ఏకాదశి తిథి, మకా నక్షతం కొందరికి సెంటిమెంట్గా కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. 25న విదియ, విశాఖ నక్షత్రం అనుకూలం. ఈ నక్షత్రంతో కూడిన పేర్లు ఉన్న అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వీలుంది.
- ఈనెల 22న చతుర్దశి. తిథి బాగా లేకపోయినప్పటికీ రోజు మంచిది కావడంతో ఈరోజు చాలామంది నామినేషన్లు వేసేందుకు సుముఖత చూపొచ్చు. ఈనెల 23న మంగళవారం, పౌర్ణమి, 24న పాడ్యమి.. కొందరు సెంటిమెంట్ను పాటిస్తారు. ఈరోజుల్లో నామినేషన్లు వేయడం సాధ్యమైనంత వరకు ఉండదు. పాడ్యమి కంటే విదియ, తదియ తిథులు మరింత విజయాలకు అనువుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
నేర చరిత్ర చెప్పాల్సిందే
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ నేరచరిత్ర, కేసుల వివరాలు వెల్లడించే సమయం ఆసన్నమైంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థి బి.ఫామ్ అందించకపోతే స్వతంత్రులుగా గుర్తింపు పొందుతారు. నామపత్రాలు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్కు సంబంధించి ఫామ్-26 విద్యార్హతలు, నిర్వర్తించే బాధ్యతలు, ఆస్తుల వివరాలతోపాటు క్రిమినల్ కేసుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు సదరు వివరాలను ఆన్లైన్లో ఉంచుతారు. తప్పుడు వివరాలు ఇచ్చినా.. సరైనవి నమోదు చేయకపోయినా ఎవరైనా కోర్టులో సవాలు చేయొచ్చు. ఫారంలోని ప్రతి గడియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సంబంధం లేని విషయమైతే నాట్ అప్లికేబుల్ అని రాయాలి. లేకుంటే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థి ఏదో ఒక నియోజకవర్గానికి చెందినవారై ఉంటే సరిపోతుంది. ఆయన్ని బలపరిచే అభ్యర్థి మాత్రం స్థానిక ఓటరై ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీ నుంచి అయితే ఒక ఓటరు బలపరిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థులైతే పది మంది బలపరచాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 30-04-2024]
మండలంలోని పెద్దమర్రివీడు, ఐరన్ బండ, ఎన్నె కండ్ల, పిల్లిగుండ్ల తదితర గ్రామాల నుంచి 200 కుటుంబాలు తెదేపాలో చేరినట్లు మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మంగళవారం తెలిపారు. -
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి రావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటర్ చైతన్య ర్యాలీ
[ 30-04-2024]
ఆదోని పట్టణంలో మంగళవారం ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. -
అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు
[ 30-04-2024]
మే 5న కర్నూలు డీఎస్సీ స్టేడియంలో అండర్ 19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. -
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు. -
ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే..
[ 30-04-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు. -
ముస్లింలకు జగన్ ధోకా
[ 30-04-2024]
తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. -
పండుటాకులతో జగన్ పింఛనాట
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. -
జలం కోసం జనం ఆందోళన
[ 30-04-2024]
మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
అసెంబ్లీ బరిలో 126 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు నిలిచారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 31 మంది పోటీలో ఉన్నారు. -
పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి
[ 30-04-2024]
మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. -
1 వరకు దరఖాస్తుకు గడువు
[ 30-04-2024]
ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. -
రాక్షస పాలనను తరిమేద్దాం
[ 30-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
[ 30-04-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. -
స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ టంబ్లర్ గుర్తు
[ 30-04-2024]
కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్.ఎన్కు అధికారులు గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించారు. -
ఫైనాన్స్ సంస్థకు మొట్టికాయ
[ 30-04-2024]
నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. -
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.