వానొచ్చేలోపు విత్తనమేద్దాం !
ఎండలు అధికంగానే ఉన్నా.. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భూములను సిద్ధం చేయకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు.
కూలీల కొరత అధిగమించేందుకు రైతన్న తొందరపాటు
తెలకపల్లి : రాకొండ సమీపంలో వట్టి భూములలో పత్తి విత్తనాలు నాటుతున్న దృశ్యం
నాగర్కర్నూల్, న్యూస్టుడే : ఎండలు అధికంగానే ఉన్నా.. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భూములను సిద్ధం చేయకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే కూలీల కొరత, ఎద్దులు అందుబాటులోకి రాక ఇబ్బందులు కలుగుతాయని తొందర పడుతున్నారు. గతేడాది నష్టం వచ్చినా.. ఈ సారి కూడా ఎక్కువగా పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. నాగర్కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాల్లో భూములను సిద్ధం చేయకుండానే రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. వర్షాలు సక్రమంగా పడకపోతే సరిగ్గా మొలకెత్తవు. రెండేళ్లుగా ఇలాగే విత్తుకుంటే సకాలంలో మొలకెత్తక రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం నీటి వసతి ఉంటేనే వట్టి భూముల్లో పత్తి విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
చిరుధాన్యాలపై కనిపించని ఆసక్తి..
ప్రభుత్వం ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును పెంచాలని, వాటిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిరు ధాన్యాల సాగు ఏటా జిల్లాలో వందల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. ఆముదం పూర్తిగా కనుమరుగైంది. దానిని పెంచేలా వ్యవసాయ శాఖ ఏ మాత్రం కసరత్తు చేయటం లేదు. రైతులకు అవగాహన కల్పించడం లేదు. జిల్లాలో 141 రైతు వేదికలు నిర్మించారు. ప్రతి చోట ఏఈవోను ఏర్పాటు చేశారు. మట్టి నమూనాల సేకరణ సైతం కనిపించలేదు. అవగాహన సదస్సులు నిర్వహిస్తేనే ప్రయోజనం ఉండనుంది.
అవగాహన కల్పిస్తాం..
రైతు వేదికల్లో రైతులకు తరచుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నీటి వసతి ఉంటే తప్పా వట్టి భూముల్లో పత్తి విత్తనాలను వేసుకోవద్దు. దీనిపై గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు నాటుకుంటే మంచిది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విస్తృతంగా విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎలక్షన్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం
[ 10-05-2024]
జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ భాజపా కార్యాలయంలో బూత్ అధ్యక్షుడు, పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. -
భారాస విస్తృత ప్రచారం
[ 10-05-2024]
రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో భారాస నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. -
ఘనంగా బసవ జయంతి
[ 10-05-2024]
జంగమ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో బసవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
[ 10-05-2024]
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
తరాలు చూసినా తరగని స్ఫూర్తి
[ 10-05-2024]
దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్!
[ 10-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. -
భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: సురేఖ
[ 10-05-2024]
కేంద్రంలో మరోమారు భాజపాను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పేనని కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ నియోజకవర్గ సమన్వయకర్త సురేఖ అన్నారు. -
పాలమూరులో ప్రచార హోరు
[ 10-05-2024]
షెడ్యూల్ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించలేదు. మహబూబ్నగర్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, నాగర్కర్నూల్కు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ వచ్చారు -
రాముడి పేరుతో భాజపా ఓట్ల వేట: వంశీచంద్
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. -
గెలిపిస్తే రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా
[ 10-05-2024]
ఎంపీగా తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే లైను తీసుకొస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. -
ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం
[ 10-05-2024]
ఎంత మంది వ్యతిరేకించినా సోనియా గాంధీ సాహస నిర్ణయంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు: చల్లా
[ 10-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయుడిని గెలిపించినట్లే లోక్సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. -
ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
[ 10-05-2024]
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. -
అక్షింతల రాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలి: జూపల్లి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రాముడి అంక్షితల పేరిట రాజకీయం చేస్తోందని ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
పోలింగ్ శాతం పెంపే లక్ష్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కొన్ని గ్రామాలు తలనొప్పిగా మారాయి. -
ప్రధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
[ 10-05-2024]
ప్రధాని మోదీ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్గౌతం తెలిపారు. -
బాదేపల్లి మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు నింపిన డీసీఎంకు మంటలు
[ 10-05-2024]
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ బయట దుకాణాల ముందు మొక్కజొన్న బస్తాలతో నిలిపి ఉన్న డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు (Latest News)
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ