ధాన్యం బస్తాల దొంగల అరెస్టు
జల్సాలు చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అత్యాశతో వరిధాన్యం బస్తాలను అపహరించి సొమ్ము చేసుకుంటున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
వెల్దండ గ్రామీణం, న్యూస్టుడే : జల్సాలు చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అత్యాశతో వరిధాన్యం బస్తాలను అపహరించి సొమ్ము చేసుకుంటున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వెల్దండ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విష్ణువర్దన్రెడ్డి వివరాలు వెల్లడించారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో గల కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ గోదాంను కల్వకుర్తి పట్టణానికి చెందిన సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్డ్ మిల్ యజమాని రమేశ్బాబు అద్దెకు తీసుకొని వరి ధాన్యం బస్తాలు నిల్వ చేసుకున్నారు. నిల్వ ఉంచిన వాటిలో నుంచి 3వేల బస్తాలు చోరీకి గురయ్యాయి. గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈనెల 3న వెల్దండ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా డీసీఎం, బొలెరొ డ్రైవర్లుగా పనిచేస్తున్న పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన కేశమోని రాంబాబు, పెద్దకర్పాలకు చెందిన అభిషేక్రెడ్డి, గండ్రావుపల్లికి చెందిన కుందేళ్ల మల్లేశ్, నాగనోలుకు చెందిన గొడుగు స్వామి ముఠాగా ఏర్పడి ధాన్యం చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిఘా అంతగా లేని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను అపహరించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పెద్దాపూర్ గోదాంలో నుంచి పలుమార్లు డీసీఎం, బొలెరొ వాహనాల్లో 2,600 ధాన్యం బస్తాలను (1,040 క్వింటాళ్లు) నెక్కొండకు చెందిన శ్రీసత్యసాయి పారా బాయిల్డ్ రైస్మిల్కు రూ.19.76 లక్షలకు విక్రయించారు. గతంలో చిన్నంబావి, కోడేరు మండలాల్లో ధాన్యం బస్తాలను అపహరించినట్లు అంగీకరించారు. నలుగురిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ. 5 లక్షలను రికవరీ చేశామన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యహరించిన ఎస్సై రవి, సిబ్బంది కిశోర్రెడ్డి, మురళీని సీఐ ప్రత్యేకంగా అభినంధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి