నిబంధనలకు దూరమై.. ప్రమాదాలకు చేరువై!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డెక్కన్ మాల్, స్వప్నలోక్ దుకాణ సముదాయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది.
యథేచ్ఛగా పట్టణ యజమానుల ఉల్లంఘనలు !
మిర్యాలగూడ, న్యూస్టుడే: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డెక్కన్ మాల్, స్వప్నలోక్ దుకాణ సముదాయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. అయితే చాలా పట్టణాలు, నగరాలు పరిశీలిస్తే దుకాణ సముదాయాలో,్ల అపార్ట్మెంట్ నిర్మాణాల్లో అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టణీకరణ పెరిగి..బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. వీటిలో చాలా వరకు అగ్నిమాపక నిబంధనలకు దూరంగానే ఉన్నాయి.
మిర్యాలగూడ - సాగర్ ప్రధాన రహదారిపై కనీస స్థలం వదలకుండా నిర్మించిన
బహుళ అంతస్తుల దుకాణ సముదాయాలు
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 320 వరకు ప్రైవేటు ఆసుపత్రులు , 250 వరకు బహుళ అంతస్తుల భవనాలు, 120కి పైగా వాణిజ్య సముదాయాలు, 21 వరకు సినిమా థియేటర్లు , వెయ్యికి పైగా ప్రైవేటు పాఠశాలలు, 280 వరకు బియ్యం మిల్లులు , 200 వరకు ఇతర పరిశ్రమలు ఉన్నాయి.
* ప్రధానంగా మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. మిర్యాలగూడ, మఠంపల్లి, మేళ్లచెరువు ప్రాంతాల్లో బియ్యం, సిమెంటు పరిశ్రమలు, చౌటుప్పల్, బీబీనగర్ ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సైతం తరచూ అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మిర్యాలగూడ మండలంలోని పత్తిమిల్లులో ఏడాదిన్నర క్రితం అగ్నిప్రమాదం జరిగి రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లింది.
* అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాల్సి ఉండగా.. యజమానులు మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించేస్తున్నారు. కాగితాలపైనే నిబంధనలు పాటిస్తున్నట్లుగా చూపుతూ పురపాలిక అనుమతులు పొందుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వెళ్లే స్థలం లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు.
* నిర్మాణాలు పూర్తయిన భవనాలకు అగ్నిమాపకశాఖ ‘ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం’(ఎన్వోసీ) పొందటం లేదు. అగ్నినిరోధక పరికరాలు అమర్చటం లేదు. దీంతో ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఏర్పడుతోంది.
* అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీ చేసిన సమయంలో నోటీసులు ఇస్తుండగా.. ఇవి అక్కడి వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. వాటిపై చర్యలు మాత్రం ఉండటం లేదు.
ఎన్వోసీ తప్పనిసరి
* ఐదువందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భవనానికి అగ్నిమాపకశాఖ ఎన్వోసీ తప్పనిసరిగా ఇస్తేనే పురపాలికశాఖ అనుమతి జారీ చేయాల్సి ఉంది.
* 15 మీటర్లు ఎత్తు దాటిన భవనాలకు ప్రత్యేకంగా నీటి ట్యాంకును నిర్మించాలి. ప్రతి అంతస్తుకు అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనం పైపు అమర్చేలా గేట్వాల్వు ఏర్పాటు చేసి ఉంచాలి.
* అగ్నినిరోధక పరికరాలతో పాటుగా ఫైర్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
* బహుళ అంతస్తు భవనం కింద భాగంలో నీటిని నిల్వ చేసేందుకు సంపు నిర్మించి ఉంచాలి.
* ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు గాను ప్రత్యేక ద్వారం నిర్మించాలి.
* ఆసుపత్రులు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ చుట్టూ నాలుగువైపులా ఫైరింజన్ తిరిగేందుకు ఖాళీస్థలం ఉంచాలి.
సెట్బ్యాక్ లేక..
* జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే సమయంలో సెట్బ్యాక్ నిబంధనలు పాటించటం లేదు. అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు స్థలం సరిపడా ఉండటం లేదు.
* దుకాణ సముదాయాలు, పాఠశాల భవనాల్లో కేవలం ఒకే మార్గం అందుబాటులో ఉంటుంది. రెండు మార్గాలు విధిగా ఉండాలన్న నిబంధన ఉన్నా.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం లేదు.
* నిరంతరం రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రుల్లో అగ్నిమాపక నిబంధనలే పాటించటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఆటో డ్రైవర్ డ్రెస్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమారెడ్డి ప్రచారం నిర్వహించారు. -
హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి
[ 08-05-2024]
భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ను కలిసి మాట్లాడారు. -
సమీక్షిస్తూ.. సౌకర్యాలు ఆరా తీస్తూ..!
[ 08-05-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. -
ప్రైవేటు పనులకు.. ప్రభుత్వ పరికరాలు
[ 08-05-2024]
జిల్లాలోని విద్యుత్తు సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులతో విద్యుత్తుశాఖ సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. -
ఓటు వేసేందుకు గుర్తింపుకార్డు తప్పనిసరి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. -
పార్టీలు చిన్నవైనా.. ప్రభావం పెద్దది
[ 08-05-2024]
గడిచిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు చిన్నవైనా ప్రభావం పెద్దగానే చూపిన ఘటనలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన వైనం లేకపోలేదు. -
గెలిస్తే ఐదేళ్లకు సరిపడా ప్రగతి ప్రణాళికలు
[ 08-05-2024]
‘ మాది ప్రజలకు సేవ చేసే కుటుంబం. 30 ఏళ్ల క్రితం జానారెడ్డి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరిగింది. ఇప్పుడు గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో నేను చేసిన పనులు చేప్పే ఓట్లడుగుతాను. -
ఓటుకు సెలవివ్వొద్దు..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. -
విదేశాల్లో ఓటుహక్కు ఇలా..
[ 08-05-2024]
ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. -
26 రోజుల పోరాటం.. 22 రోజులకు ఫలితం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల పాట్లు మామూలుగా లేవు. నెలన్నర పాటు ఎన్నికల ప్రక్రియ నడవడం వారికి పరీక్షా సమయంగా మారింది. -
చివరి భూములకూ సాగు నీరందిస్తాం: జానారెడ్డి
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో, కార్నర్ సమావేశం నిర్వహించారు. -
సేవ చేద్దాం.. ఆనందాలు పంచుదాం!
[ 08-05-2024]
కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్ క్రాస్’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్ క్రాస్ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. -
శోభాయమానం.. నవ నృసింహుల సాలహారం
[ 08-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో నవ నృసింహుల దివ్య స్వరూపాలతో సాలహారం నిర్మించాలన్న భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇక్కడి రాజ గోపురానికి ఇరువైపులా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తొమ్మిది నారసింహ క్షేత్రాల్లోని స్వయంభువులను ఆలయ ప్రాకారంలో తీర్థజనులు సందర్శించేలా తీర్చిదిద్దారు. -
అక్రమ రవాణాకు చెక్
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, విలువైన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. -
ఫిర్యాదు వచ్చిందా.. చిటికెలో పరిష్కారం
[ 08-05-2024]
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు. -
వర్షాలకు రూ.80 లక్షల నష్టం: ఎస్ఈ
[ 08-05-2024]
అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ శాఖ ఎస్ఈ పాల్రాజు తెలిపారు. -
నిత్య కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ఆరాధన
[ 08-05-2024]
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. -
వారి భవిత రాసేది.. యువతే..!
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. తమ రాతను ఎలా మార్చుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
వేసవి శిబిరం.. క్రీడలకు ఊతం
[ 08-05-2024]
వేసవి క్రీడా శిక్షణ కేంద్రాలు బాలలతో సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్