‘మత్తు’కు కొత్త ఎత్తులు..!
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోంది. యువతే లక్ష్యంగా భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. పోలీసుల నిఘానూ లెక్కచేయకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవలీలగా కావాల్సిన మత్తును పొందుతున్నారు.
పేటలో విచ్ఛలవిడిగా గంజాయి వినియోగం
సూర్యాపేట పట్టణం చర్చికాంపౌండ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే పనిగా గంజాయి విక్రయిస్తుండటంతో పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. అయినా ఆ వ్యాపారాన్ని మాత్రం విడిచి పెట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నెట్వర్క్కు ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే వ్యాపారంలో రూ.లక్షలు ఆర్జించి ఇటీవల సొంతంగా నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు. ఇతని కింద గంజాయి సరఫరా చేసే మరో 23 ఏళ్ల యువకుడు రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు.
సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన ఐదుగురు యువకులు నిత్యం గంజాయి మత్తులో తూగుతుంటారు. పాతికేళ్ల వయస్సులో ఉండే వీరిలో ఎవరి బరువూ నలభై కిలోలకు మించి ఉండదు. యుక్తవయస్సులోనే గంజాయి వ్యసనానికి బానిసలయ్యారు. హైదరాబాద్లోని ధూల్పేట నుంచి గంజాయి తెచ్చి వినియోగించడంతోపాటు పలువురు యువకులకు విక్రయిస్తున్నారు. వీరిని పోలీసులు పలుమార్లు అదుపులోకి తీసుకున్నా.. ఏదో ఒక రకంగా బయటపడుతున్నారు. తిరిగి అదే వ్యసనంలో మునిగితేలుతున్నారు. రాయినిగూడెం కేంద్రంగా నిత్యం రాత్రి వేళల్లో వీరు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనలో రాజీపడే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఆ మాటే వినపడకూడదు. యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేసి, పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమిస్తాం. గంజాయి, కొకైన్, హెరాయిన్ సరఫరాను నియంత్రించి, రవాణా చేసే నిందితులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది.. దేశానికి ఆదర్శంగా నిలపాలి.
గత ఏడాది డిసెంబరు 10న అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం.
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోంది. యువతే లక్ష్యంగా భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి. పోలీసుల నిఘానూ లెక్కచేయకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవలీలగా కావాల్సిన మత్తును పొందుతున్నారు. ఐదేళ్ల క్రితం సూర్యాపేటలో ఒకే ఒక్క గంజాయి విక్రేత అందుబాటులో ఉండేవాడు.. ప్రస్తుతం ఈ సంఖ్య రెండు వందలకు చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి విక్రయిస్తూ లేదా వినియోగిస్తూ పట్టుబడిన పాత నేరస్థులు అలవాటుగా తిరిగి అదే ప్రవృత్తిలో కొనసాగుతుండటం గమనార్హం. వీరిపై నిఘా పెడితే గంజాయి వినియోగాన్ని కొంత మేర అడ్డుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పోలీసులు అటువైపుగా అడుగులు వేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సీలేరు నుంచి సూర్యాపేటకు..
పోలీసుల నిఘాను తప్పించుకొని గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. గతంలో పెద్దమొత్తంలో గంజాయిని ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి కార్లల్లో తరలించే వారు. ప్రస్తుతం పోలీసుల నిఘా పెరగడంతో ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారు. వినియోగదారులంతా కలిసి డబ్బు పోగుచేసుకొని, సమూహంగా ఏర్పడి నలుగురు యువకులను రెండు ద్విచక్ర వాహనాల్లో సీలేరు లేదా విశాఖపట్నం ప్రాంతానికి పంపిస్తున్నారు. గంజాయిని తక్కువ మోతాదులో కొనుగోలు చేసుకొని ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు బయలుదేరుతారు. మరో ఇద్దరు యువకులు వీరికి ఎస్కార్ట్ (రక్షణ)గా ముందు ఉంటారు. ఎక్కడైనా పోలీసుల తనిఖీలున్నట్లు గుర్తిస్తే వెంటనే చరవాణి ద్వారా సమచారం చేరవేస్తారు. వారు భద్రాచలం మీదుగా ఖమ్మం చేరుకొని దంతాలపల్లి నుంచి సూర్యాపేటకు చేరుకుంటున్నట్లు సమాచారం. మరికొంత మంది యువకులు హైదరాబాద్ ధూల్పేటపై ఆధారపడుతున్నారు. గంజాయిని కాగితంలో చుట్టగా చుట్టి వినియోగించేందుకు అవసరమైన ఓసీబీ పేపర్లనూ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తెలిసింది.
తల్లిదండ్రులపైన వేధింపులు
గంజాయి వ్యసనానికి బానిసలైన వారు వింత వింతగా ప్రవర్తిస్తూ సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కల్పిస్తున్నారు. రహదారులపై నడుచుకుంటూ వెళ్లే వారిపైనే కాకుండా ఇంట్లో తల్లిదండ్రులపైనా మత్తులో తమ ప్రతాపం చూపుతున్నారు. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి వారిపైనే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. మత్తులో వీరి చేష్టలకు విసిగి వేసారిన తల్లిదండ్రులు కన్న పిల్లలనే కడతేర్చిన ఘటనలూ జిల్లాలో ఉన్నాయి. కోదాడలో ఓ తల్లి గంజాయి వ్యసనానికి బానిసగా మారిన తన కుమారుడిని చేతులు, కాళ్లు కట్టేసి కంట్లో కారం కొట్టిన విషయం విదితమే. తిరుమలగిరి ప్రాంతంలో ఓ తల్లి ఏకంగా కుమారుడిని హతమార్చింది. పోలీసులు గంజాయి విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
నిఘా పటిష్ఠం చేస్తాం
- రాజశేఖర్, ఇన్స్పెక్టర్, సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక బృందాన్ని నియమిస్తాం. పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నిత్యం ఐడీ పార్టీ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతోంది. సూర్యాపేట శివారు ప్రాంతాలతోపాటు 60 ఫీట్ల రోడ్డులోనూ ప్రత్యేక సిబ్బంది నియమించి తగిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్