బస్తాలు రాక.. లక్ష్యం నెరవేరక..!
కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు రైస్మిల్లులకు బస్తాల సమస్య నెలకొంది. ఖరీఫ్ ధాన్యంతో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బస్తాలకు కాప్రా పురుగు పట్టడంతో (సన్నని తెల్లపురుగు)..
మిర్యాలగూడలో ధాన్యం మిల్లులో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నిల్వలు తనిఖీ చేస్తున్న జిల్లా పౌరసరఫరాల అధికారుల బృందం (పాత చిత్రం)
మిర్యాలగూడ, న్యూస్టుడే: కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు రైస్మిల్లులకు బస్తాల సమస్య నెలకొంది. ఖరీఫ్ ధాన్యంతో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బస్తాలకు కాప్రా పురుగు పట్టడంతో (సన్నని తెల్లపురుగు).. ఈ బస్తాల్లో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భారత ఆహార సంస్థకు లెవీ పెట్టేందుకు మిల్లర్లు ముందుకు రావటం లేదు. పురుగు వచ్చిన బస్తాల్లో భారత ఆహార సంస్థకు బియ్యాన్ని మిల్లర్లు పంపితే వారు వెంటనే తిరస్కరిస్తున్నారు.
పంపిణీ విధానం ఇలా..
పౌరసరఫరాల శాఖ ఐకేపీ కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని 54 శాతం కొత్త బస్తాలు, 46 శాతం పాత బస్తాల్లో మిల్లులకు ధాన్యం లారీల్లో లోడు చేసి పంపుతున్నారు. ధాన్యం మరపట్టిన తరువాత లెవీగా భారత ఆహార సంస్థకు కొత్త బస్తాల్లో నింపి అందించాలి. కొత్త బస్తాలపై ఏసీకే నంబర్లు ముద్రించి మిల్లర్లు లెవీ పెట్టాల్సి ఉంది. గత ఖరీఫ్ ధాన్యం లెవీ పెట్టే విషయంలో జాప్యం అవుతుండగా ప్రస్తుతం ఈ బస్తాల్లో పురుగులు రావటంతో మిల్లర్లు సరఫరా చేయలేకపోతున్నారు. తమకు కొత్తగా బస్తాలు ఇవ్వాలంటూ జిల్లా పౌరసరఫరాల శాఖకు, కలెక్టర్కు వినతి పత్రాలు అందిస్తున్నారు. భారత ఆహార సంస్థ నుంచి లెవీకి అనుమతి వచ్చే విషయంలో జరుగుతున్న జాప్యంతో తమ వద్ద నిల్వ ఉంచిన ధాన్యం మిల్లింగ్కు కూడా పనికిరాకుండా పోతుందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి వచ్చిన సమయంలో బస్తాలు ఖాళీ చేసి ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యం చేస్తున్నారు.
గతంలో కోటా ఇవ్వని వారికి కొత్త బస్తాలు..
- వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, నల్గొండ
ఖరీఫ్ ఐకేపీ ధాన్యం మిల్లులకు పంపిణీ చేసే సమయంలో 54 శాతం కొత్త బస్తాలు ఇవ్వని వారికి మాత్రమే కొత్త బస్తాలు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అనుమతించారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డీఎం పరిశీలించి కొత్త బస్తాలు ఇస్తున్నారు. అన్ని మిల్లులకు గతంలో పంపిన కొత్త బస్తాలను శుభ్రం చేయించి ఎఫ్సీఐకి లెవీ పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.