ఇచ్చిన హామీలు అమలు చేస్తాం
భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, భారాస, భాజపా అభ్యర్థులకు తమకు పోటీయే కాదని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చిత్రంలో కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి
భువనగిరి గంజ్, న్యూస్టుడే: భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, భారాస, భాజపా అభ్యర్థులకు తమకు పోటీయే కాదని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. భువనగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని స్థానిక శాసనసభ్యుడు కుంభం అనిల్కుమార్రెడ్డి అధ్యక్షతన మంగళవారం భువనగిరిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజగోపాల్రెడ్డితో పాటు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి హాజరయ్యారు. రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల భారాస ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, అవినీతికి పాల్పడిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి భువనగిరి శాసనసభా స్థానంలో కాంగ్రెస్ను గెలిపించారని, అదే స్ఫూర్తితో చామల కిరణ్కుమార్రెడ్డిని అత్యధిక మెజార్టీ సాధించేలా కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని, ఎంపీ టికెట్ ఇచ్చేదిలేదని స్పష్టం చేయడంతో విరమించుకుని భారాసలో కొనసాగుతున్నారన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు శాసనసభా ఎన్నికలకు సమష్టిగా పనిచేసినట్లే ఎంపీ ఎన్నికల్లోనూ పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తల కృషితో భువనగిరిలో గెలిచి చరిత్ర సృష్టించామన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ భారాసను ఓడించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదలను, పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలని కోరారు. సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, పురపాలిక అధ్యక్షుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పీసీపీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, పీసీపీ కార్యదర్శులు పోత్నక్ ప్రమోద్కుమార్, కసుభ శ్రీనివాసరావు, నాయకులు పచ్చిమట్ల శివరాజుగౌడ్, సామ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బర్రె జహంగీర్, కైలాశ్నేత, రామాంజనేయులుగౌడ్, సురభి, పద్మ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్