నేడే విడుదల రంగం
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి
రెండు లోక్సభ స్థానాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
నల్గొండ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం
ఈనాడు, నల్గొండ : లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. నల్గొండ లోక్సభ స్థానానికి సంబంధించి నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయంలో, భువనగిరి స్థానానికి భువనగిరి కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నల్గొండ ఆర్వోగా వ్యవహరిస్తున్న కలెక్టరు దాసరి హరిచందన, భువనగిరి ఆర్వోగా ఉన్న స్థానిక కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ సెలవు దినాలు, ప్రత్యేక రోజుల్లో మినహాయించి ఈ నెల 25వ తేదీ వరకు సాధారణ రోజుల్లో రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల క్రతువు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మంచి రోజులు చూసుకొని భారీ ర్యాలీలు, సభలతో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు పోలింగ్ మే 13న జరగనున్న సంగతి తెలిసిందే.
నామినేషన్ల అనంతరం ముమ్మర ప్రచారం
నామినేషన్ల క్రతువు ప్రారంభం కానుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాస అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశాలు తుది దశకు చేరాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల కార్యక్రమం ఉన్నందునా ఆ లోపు మిగిలిన సెగ్మెంట్లలో సమావేశాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అనంతరం మండలాల వారీగా సమావేశాలు, ముఖ్య కార్యకర్తలతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించాయి. నల్గొండలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి ఈ నెల 24న నల్గొండలో భారీ సభను ఏర్పాటు చేసి అదే రోజు నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమానికి మంత్రి, నల్గొండ లోక్సభ ఇన్ఛార్జ్ ఉత్తమ్కుమార్రెడ్డితో పాటూ మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి హాజరుకానున్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ఈ నెల 22న నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్ ఈ నెల 22, 23 తేదీల్లో నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, జగదీశ్రెడ్డి నల్గొండలో, హరీశ్రావు భువనగిరిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- భాజపా నల్గొండ, భువనగిరి అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ ఈ నెల 22, 23 తేదీల్లో నామపత్రాలను దాఖలు చేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ డా.లక్ష్మణ్లో ఎవరో ఒకరు నల్గొండలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, భువనగిరిలో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాష్ట్రంలో భువనగిరి స్థానంలోనే పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. భువనగిరిలో ఆయన ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమానికి పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.