19న ఇద్దరు.. 22న మరొకరు
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల (నామపత్రాలు) దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
లోక్సభ నామపత్రాల దాఖలు తేదీలు ఖరారు
ఈనాడు, నిజామాబాద్ : లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల (నామపత్రాలు) దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఇప్పటికే ఓట్ల సమరానికి సన్నద్ధమయ్యారు. నిత్యం పార్టీ శ్రేణులతో సమావేశమవుతూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా, భారాస అభ్యర్థులు 19వ తేదీన, కాంగ్రెస్ అభ్యర్థి 22న నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయా పార్టీల నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ముఖ్య నాయకుల రాక..
భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఈ నెల 19న పేరు, బలం ఆధారంగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమం సాదాసీదాగా ఉండనుంది. ఈ నెల 25న మరోమారు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజు ర్యాలీ, సభ ఉండనుందని సమాచారం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని సమాచారం. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 19వ తేదీనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారాస నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరవుతారని చెబుతున్నారు. 22న కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పెద్దలు హాజరవుతారని తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో రెండు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒకటి అభ్యర్థి నామినేషన్ రోజునే నిజామాబాద్ నగరంలో నిర్వహించాలనే ఆలోచన జిల్లా పార్టీ చేస్తోంది. ఆ రోజు వీలుకాకుంటే సభ తేదీ మారే అవకాశం ఉంది. దీనిపై బుధవారం స్పష్టత రానుంది.
విమర్శనాస్త్రాలతో వేడి..
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఇందుకు పార్టీ సమావేశాలే కాకుండా విలేకర్ల సమావేశాలు, ప్రసార మాధ్యమాల్లో ఇంటర్వ్యూలను వేదికగా చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థుల వైఫల్యాలు, తమకు అవకాశం ఇస్తే ఏం చేస్తామనే విషయాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇక హోరెత్తనుంది..
మూడు పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంపైనే దృష్టిసారించాయి. ఇకపై జనంలోకి వెళ్లే విధంగా ప్రచార కార్యాచరణ అమలు చేయనున్నాయి. ఇందుకోసం పార్టీలు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయ కమిటీలను వేస్తున్నాయి. ఆయా కమిటీలు మండలాల వారీగా ఉన్న కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. నామపత్రాల దాఖలు తర్వాత ప్రచార సామగ్రి మండలాల వారీగా పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. -
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 29-04-2024]
ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు. -
ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు
[ 29-04-2024]
ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
[ 29-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. -
పోలీసు పరిశీలకుడికి స్వాగతం
[ 29-04-2024]
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. -
భానుడు భగభగ
[ 29-04-2024]
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. -
ఆగని గంజాయి రవాణా
[ 29-04-2024]
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. -
‘గల్ఫ్ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
[ 29-04-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బరిలో ఉండేదెవరో?
[ 29-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. -
నేనండి..ఈవీఎంని
[ 29-04-2024]
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. -
ఎల్లలు దాటిన నాట్యాభినయం
[ 29-04-2024]
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. -
ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే
[ 29-04-2024]
ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. -
స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
[ 29-04-2024]
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. -
కాలూరుకు చెందిన గర్భిణి మృతి
[ 29-04-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రచారానికి పొలంబాట
[ 29-04-2024]
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!