చివరి ప్రయత్నంలో సివిల్స్
ఐదు సార్లు సివిల్స్ పరీక్ష రాసినా ఆశించిన ఫలితం రాలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో విజయం సాధించారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్.
కామారెడ్డి జిల్లావాసి రజనీకాంత్కు 587వ ర్యాంకు
ఈనాడు, కామారెడ్డి: ఐదు సార్లు సివిల్స్ పరీక్ష రాసినా ఆశించిన ఫలితం రాలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో విజయం సాధించారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో అతడు 587వ ర్యాంకు సాధించారు. బాల్యం నుంచి రజనీకాంత్ చదువులో చురుకుగా ఉండేవారు. అతడు నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యం సాధించేందుకు అవసరమైన తోడ్పాటును తల్లిదండ్రులు సిద్దిరాములు, పద్మ అందించారు. పాఠశాల విద్యను కామారెడ్డి జిల్లాలో పూర్తిచేసిన రజనీకాంత్ ఇంటర్ను ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో అభ్యసించారు. దిల్లీలోని ఎస్వీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. దిల్లీలోనే పీజీ పూర్తిచేశారు.
మూడు సార్లు మెయిన్స్కు అర్హత
ఆరుసార్లు సివిల్స్ పరీక్ష రాసిన రజనీకాంత్ మూడు సార్లు మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. చివరి ప్రయత్నంలో మంచి ఫలితం సాధించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన అతడి తల్లిదండ్రులు వ్యాపారరీత్యా కామారెడ్డి పట్టణంలోని కల్కీనగర్లో స్థిరపడ్డారు.
సమాజ సేవ చేయాలనే లక్ష్యం నెరవేరింది : రజనీకాంత్
చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్ను ఎంచుకున్నాను. డిగ్రీ చివరి సంవత్సరం నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాను. ఆరో ప్రయత్నంలో ర్యాంకు సాధించాను. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించాను. నిరాశ చెందకుండా సివిల్స్ సాధించాలనే తపనతో చివరి వరకు ప్రయత్నించి సఫలమయ్యాను. ఇందుకు నా తల్లిదండ్రులు వెన్నంటే ఉండి ప్రోత్సహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 29-04-2024]
ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెలా లక్ష్మీనారాయణ అన్నారు. -
ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు
[ 29-04-2024]
ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు.. 1,45,912
[ 29-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో 53 వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. -
పోలీసు పరిశీలకుడికి స్వాగతం
[ 29-04-2024]
జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పోలీసు పరిశీలకుడు రాజేశ్ మీనా ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. -
భానుడు భగభగ
[ 29-04-2024]
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతున్నాడు. ఆదివారం అత్యధికంగా డోంగ్లిలో 44 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అత్యల్పంగా పగటి పూట సదాశివనగర్లో 39.5 డిగ్రీల ఎండ కాచింది. -
ఆగని గంజాయి రవాణా
[ 29-04-2024]
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
నిఘా నేత్రం.. సమస్తం నిక్షిప్తం
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. -
‘గల్ఫ్ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
[ 29-04-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇన్నాళ్లకు గల్ఫ్ కార్మికులు గుర్తుకొచ్చారా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. భాజపా జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బరిలో ఉండేదెవరో?
[ 29-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. -
నేనండి..ఈవీఎంని
[ 29-04-2024]
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. -
ఎల్లలు దాటిన నాట్యాభినయం
[ 29-04-2024]
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. -
ముగ్గురూ.. గతంలో పోటీ చేసిన వారే
[ 29-04-2024]
ప్రస్తుతం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన అనుభవం ఉంది. -
స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
[ 29-04-2024]
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. -
కాలూరుకు చెందిన గర్భిణి మృతి
[ 29-04-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం కాలూరుకు చెందిన గర్భిణి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రచారానికి పొలంబాట
[ 29-04-2024]
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు