ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
ఒకరి దుర్మరణం, ఇద్దరికి గాయాలు
నిజామాబాద్ గ్రామీణం : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఠాణా ఎస్సై మహేష్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గౌతమ్నగర్కు చెందిన ధమాపాల్ గౌతమ్(33), ఉమాకాంత్, వినోద్లు మంగళవారం బైపాస్ రోడ్డు నుంచి శ్మశానవాటిక రోడ్డు వైపు వెళ్తుండగా.. అర్సపల్లి నుంచి కంఠేశ్వర్ వైపు వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కిందపడిన ధమాపాల్ గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఉమాకాంత్, వినోద్లు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌతమ్ తండ్రి నార్వాడే గౌతమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
అదృశ్యమై దొరికిన ఇద్దరు విద్యార్థినులు
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: కామారెడ్డి బాలసదనంలో ఉంటున్న ఇద్దరు అనాథ విద్యార్థినులు అదృశ్యమై నాలుగు రోజుల తర్వాత దొరికినట్లు బాలసదనం సూపరింటెండెంట్ తెలిపారు. పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని హరిజనవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఈ నెల 13న పాఠశాలకు వెళ్లి తిరిగి బాలసదనానికి చేరుకోలేదు. విద్యార్థినుల కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. ఆందోళనకు గురైన బాలసదనం ఇన్ఛార్జి గంగుబాయి బుధవారం ఉదయం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తును ప్రారంభించారు. రాత్రి రైల్వేస్టేషన్ సమీపంలో విద్యార్థినులిద్దరూ ఉన్నట్లు తెలుసుకున్న బాలసదనం అధికారులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోల్తా పడిన ధాన్యం లారీ
[ 30-04-2024]
ఎల్లారెడ్డి పట్టణ శివారులో ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
[ 30-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న రెండు ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో గల కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు పాలనాధికారి చంద్రమోహన్ మంగళవారం తనిఖీ చేశారు. -
గడప, గడపకు కాంగ్రెస్
[ 30-04-2024]
ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తాండలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం గడప, గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేశారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
[ 30-04-2024]
ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే టాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అదనపు పాలనధికారి చంద్ర మోహన్ అధికారులకు సూచించారు, -
విశాల్ జన సభకు తరలిన భాజపా శ్రేణులు
[ 30-04-2024]
మెదక్ జిల్లా అల్లదుర్గ్ లో జగనున్న భాజపా విశాల్ జన సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. -
మోదీ సభకు కదిలిన భాజపా శ్రేణులు
[ 30-04-2024]
నాగిరెడ్డిపేట మండలం లోని అన్ని గ్రామాల నుంచి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించే ప్రధాని మోదీ సభకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తల్లి వెళ్లారు. -
ఆరు గ్యారంటీ పథకాలే గెలిపిస్తాయి
[ 30-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ తనను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బిల్లులు రాలేదని పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన
[ 30-04-2024]
ప్రభుత్వ అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని పేర్కొంటూ ఓ గుత్తేదారుడు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. -
కదలాలి యువత
[ 30-04-2024]
ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు. -
జహీరాబాద్ బరిలో 19 మంది
[ 30-04-2024]
నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
ఉక్కపోత.. రోగులకు వెత
[ 30-04-2024]
వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
‘కాళేశ్వరం పేరిట దోచుకున్నారు.. హామీలు మరిచారు’
[ 30-04-2024]
భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. -
పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు
[ 30-04-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. -
నిజామాబాద్ బరిలో 29 మంది
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. -
శుభముహూర్తాలకు సెలవు
[ 30-04-2024]
శుభాకార్యాలకు బ్రేక్ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
[ 30-04-2024]
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు -
ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే
[ 30-04-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఒకే స్థానం..జిల్లాలు మూడు
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. -
పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు
[ 30-04-2024]
పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. -
ఎవరి ప్రభావమెంత..?
[ 30-04-2024]
2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు. -
ఓటరు చైతన్యం.. డిజిటల్ మార్గం
[ 30-04-2024]
ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. -
ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన
[ 30-04-2024]
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్