ఈసారైనా మోక్షం లభించేనా?
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు.
అభ్యర్థుల ప్రచారంలో బోధన్ - బీదర్ రైల్వేలైన్ హామీ
న్యూస్టుడే, బాన్సువాడ
బాన్సువాడ ప్రాంతంలో గతంలో జరిగిన సర్వేలో భాగంగా పాతిన హద్దురాయి
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ లైన్కు మోక్షం లభించడం లేదు. నిధులు మంజూరైతే వెనుకబడిన ప్రాంతాలైన బాన్సువాడ, జుక్కల్, నారాయణఖేడ్ తదితర నియోజకవర్గ ప్రజలకు ఎంతోమేలు జరిగే అవకాశం ఉంది. రైల్వేలైన్ ఏర్పాటుతో పరిశ్రమలు రావడంతో పాటు కొంతమేర నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది. పాలకులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
గతంలో సర్వే పూర్తి..
బోధన్ - బీదర్ వరకు 138 కి.మీ ఉంటుంది. రైల్వేలైన్ ఏర్పాటుకు 2010లో నిధులు కేటాయించడంతో సర్వే పూర్తి చేశారు. అనంతరం ప్రతి బడ్జెట్లోనూ లైన్ ఊసేలేకుండా పోయింది. బోధన్ రైల్వేస్టేషన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు సర్వే చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అవుతోంది. ఈ ప్రాంతం నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. లైన్తో వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
మరోసారి తెరపైకి..
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల హామీలతో మరోసారి రైల్వేలైన్ ఏర్పాటు తెరపైకి వచ్చింది. పోటీల్లో నిలిచిన అభ్యర్థులు తమ తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రైల్వేలైన్ తీసుకొస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో రైల్వేలైన్తో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు. గెలిచిన అభ్యర్థి ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్లనాటి కలను తీరుస్తారా? లేదా హామీకే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాలి. ప్రజలు మాత్రం రైల్వేలైన్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. సర్వేలకే పరిమితం కాకుండా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదలాలి యువత
[ 30-04-2024]
ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు. -
జహీరాబాద్ బరిలో 19 మంది
[ 30-04-2024]
నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
ఉక్కపోత.. రోగులకు వెత
[ 30-04-2024]
వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
‘కాళేశ్వరం పేరిట దోచుకున్నారు.. హామీలు మరిచారు’
[ 30-04-2024]
భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. -
పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు
[ 30-04-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. -
నిజామాబాద్ బరిలో 29 మంది
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. -
శుభముహూర్తాలకు సెలవు
[ 30-04-2024]
శుభాకార్యాలకు బ్రేక్ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
[ 30-04-2024]
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు -
ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే
[ 30-04-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఒకే స్థానం..జిల్లాలు మూడు
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. -
పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు
[ 30-04-2024]
పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. -
ఎవరి ప్రభావమెంత..?
[ 30-04-2024]
2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు. -
ఓటరు చైతన్యం.. డిజిటల్ మార్గం
[ 30-04-2024]
ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. -
ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన
[ 30-04-2024]
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
-
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668