నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది.
నేటి నుంచి బీఈడీ కళాశాలల తనిఖీలు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది.
వర్సిటీ పరిధిలోని ఓ పట్టణంలో రెండు బీఈడీ కళాశాలలు ఒకే భవనంలో నడుస్తున్నాయి. తనిఖీ బృందం వచ్చినప్పుడు మాత్రం వేర్వేరుగా చూపిస్తారు.
పట్టణంలో ఉన్న బీఈడీ కళాశాల కన్వీనర్ కోటలో సీటు వచ్చిన విద్యార్థులకు అధిక ఫీజులు కట్టాలని చెప్పి వెనక్కి పంపి ఖాళీగా చూపుతుంది. తర్వాత మేనేజ్మెంట్ కోటాలో అధిక డబ్బులకు భర్తీ చేస్తుంది. అయినా అధికారులు పట్టించుకోరనే లేదనే విమర్శలు ఉన్నాయి.
నూతన(2024-25) విద్యా సంవత్సరానికి బీఈడీ కళాశాలల అనుబంధ గుర్తింపునకు తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు గురువారం నుంచి తనిఖీలు చేపట్టనున్నారు. వర్సిటీ పరిధిలో ఉమ్మడిజిల్లాలో 15 కళాశాలలున్నాయి. సారంగాపూర్ ఎడ్యుకేషన్ ఒకటి ప్రభుత్వ కళాశాల. మిగిలిన 13 బీఈడీ, ఒకటి బీపీఈడీ ప్రైవేటువే. గతేడాది 9 మాత్రమే ఎడ్సెట్ కౌన్సెలింగ్లో చేరాయి. సౌకర్యాలు లేకపోవడంతో ఆరింటిని చేర్చలేదు. తర్వాత కొద్ది రోజులకు వీటికి అనుమతిచ్చారు. ఈసారి ఎన్నింటికి గుర్తింపునిస్తారో.. చూడాలి మరీ.
ఇవి పాటించాలి...
ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం బీఈడీ కళాశాలకు సొంత భవనం ఉండాలి. 100 మంది విద్యార్థులకు 16 మంది అధ్యాపకులు అవసరం. ప్రిన్సిపల్ పీహెచ్డీ పట్టా పొంది ఉండాలి. కళాశాల భవనం, ల్యాబ్, మౌలిక వసతులు ఇలా పలు అంశాలు పరిశీలిస్తారు. ఈ ఏడాది అఫిలియేషన్ పొందిన 8 కళాశాలల్లో కొన్నింటిలో పూర్తిస్థాయి వసతులు లేవని ఓ ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం. 16 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట 10 మంది కూడా ఉండటం లేదు. అర్హత కలిగిన ప్రిన్సిపల్ పేరును, అధ్యాపకుల జాబితా చూపి అనుమతులు పొందుతున్నట్లు గతంలో తనిఖీ బృందం పరిశీలనలో బహిర్గతమైంది. బృందాలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ప్రిన్సిపల్, అధ్యాపకులను రప్పించి చూపిస్తున్నారు. తర్వాత వీరు కళాశాలలో మచ్చుకు కూడా కనిపించరు. తనిఖీ బృందం వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో రాత్రికి రాత్రే అన్నీ సిద్ధం చేస్తారు. ఇలాంటి వ్యవస్థలో భావితరానికి దిశానిర్దేశం చేసే ఛాత్రోపాధ్యాయులు ఎలా తయారవుతారని పలువురు మండిపడుతున్నారు.
ముందస్తుగా ఎందుకు..?
ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష జూన్లో ఉంటుంది. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్, నవంబరు-డిసెంబరులో బీఈడీ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ బీఈడీ కళాశాలల తనిఖీలకు షెడ్యూల్ ఇవ్వలేదని, తెవివిలో మాత్రం ముందస్తుగా చేపట్టడం ఏంటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నూతన వీసీల నియామకం పూర్తయిన తర్వాతనే తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.
పారదర్శకంగా చేపడతాం
- ఆచార్య ఘంటా చంద్రశేఖర్, తెవివి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్
బీఈడీ కళాశాలల తనిఖీ పూర్తి పారదర్శకంగా చేపడుతాం. ఎన్సీటీఈ నిబంధనలకు లోబడి పూర్తి వసతులు, బోధకులతో నడుస్తున్న కళాశాలకు మాత్రమే గుర్తింపు ఇస్తాం. దీనిపై ముందస్తుగానే కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చాం. గుర్తింపు ఉన్న కళాశాలలకే స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలికి లేఖ పంపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదలాలి యువత
[ 30-04-2024]
ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు. -
జహీరాబాద్ బరిలో 19 మంది
[ 30-04-2024]
నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
ఉక్కపోత.. రోగులకు వెత
[ 30-04-2024]
వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
‘కాళేశ్వరం పేరిట దోచుకున్నారు.. హామీలు మరిచారు’
[ 30-04-2024]
భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. -
పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు
[ 30-04-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. -
నిజామాబాద్ బరిలో 29 మంది
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. -
శుభముహూర్తాలకు సెలవు
[ 30-04-2024]
శుభాకార్యాలకు బ్రేక్ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
[ 30-04-2024]
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు -
ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే
[ 30-04-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఒకే స్థానం..జిల్లాలు మూడు
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. -
పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు
[ 30-04-2024]
పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. -
ఎవరి ప్రభావమెంత..?
[ 30-04-2024]
2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు. -
ఓటరు చైతన్యం.. డిజిటల్ మార్గం
[ 30-04-2024]
ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. -
ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన
[ 30-04-2024]
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.