logo

ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్‌గౌడ్‌(బహుజన్‌ లెఫ్ట్‌ పార్టీ), పోతు నవీన్‌(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్‌(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్‌ ఖాన్‌(ఆలిండియా నేషనల్‌ పార్టీ), గోలి నరేష్‌(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్‌, బీబీ నాయక్‌, మహ్మద్‌ జమీల్‌, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు.

Published : 24 Apr 2024 05:55 IST

రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు నామినేషన్‌ పత్రాలు ఇస్తున్న బీఎల్‌పీ అభ్యర్థి అశోక్‌ గౌడ్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్‌గౌడ్‌(బహుజన్‌ లెఫ్ట్‌ పార్టీ), పోతు నవీన్‌(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్‌(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్‌ ఖాన్‌(ఆలిండియా నేషనల్‌ పార్టీ), గోలి నరేష్‌(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్‌, బీబీ నాయక్‌, మహ్మద్‌ జమీల్‌, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. ఇది వరకు నామినేషన్లు వేసిన సత్యనారాయణ, శ్రీనివాస్‌, సుమన్‌, యుగంధర్‌, కోటగిరి శ్రీనివాస్‌, భూక్య నందు, ప్రశాంత్‌ రెండు, మూడో సెట్‌ పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 26 మంది నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని