తాగునీటికి కటకట!
గజపతి జిల్లాలో కొన్ని గ్రామాలు గుక్కెడు నీటికి కటకటలాడుతున్నాయి.
బిందెలతో నీళ్లు తీసుకొస్తున్న మహిళలు
పర్లాఖెముండి, న్యూస్టుడే: గజపతి జిల్లాలో కొన్ని గ్రామాలు గుక్కెడు నీటికి కటకటలాడుతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి మంచి నీటిని తెచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ‘వసుధ పథకం’ కింద అందరికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చించినా.. పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. జిల్లాలోని గుమ్మ సమితి బుబని పంచాయతీకి 12 కిలోమీటర్ల దూరంలో కింగ్డాంగ్ గ్రామం ఉంది. ఈ ఊరిలో నివసిస్తున్న 32 కుటుంబాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. బోరుబావులు, రక్షిత నీటి పథకాలు గ్రామంలో లేకపోవడంతో అర కిలోమీటర్ దూరంలో ఉన్న బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. వేసవి తాపానికి చెరువులు అడుగంటి పోవడంతో కింగ్డాంగ్ గ్రామస్థులు శివారున ఉన్న రాతిబావికి పరిమితమయ్యారు. మరికొన్ని చోట్ల ఉన్న బావులు ఇంకిపోతున్నాయని నీటి కోసం అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
రాళ్లు దేరిన రహదారి: సుమారు పంచాయతీ నుంచి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లుదేరిన రహదారి దర్శనమిస్తుంది. ఈ మార్గం మీదుగా గుమ్మ, సెరంగో, నువాగడ, రాయగడల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దీనిపై పలుమార్లు అధికారులకు , ప్రజాప్రతినిదులకు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్థులు అంటున్నారు.
వార్డు మెంబర్ తిలాష్మండల్ తమ గ్రామానికి తాగునీటి సదుపాయం, రహదారి నిర్మించాలని పలుమార్లు స్పందన కార్యక్రమంలో వినతులు సమర్పించినప్పటికీ అధికారులు తమ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారని, ఇప్పటికైనా దృష్టి సారించాలని కోరారు.
పరిష్కరిస్తాం: ఈ విషయమై గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్ కుమార్ ఘరానాయక్కి ‘న్యూస్టుడే’ వివరణ కోరగా పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఆర్పీ సభ్యురాలు సస్పెండ్
[ 29-04-2024]
గజపతి జిల్లా గుమ్మ సమితి బోడకోలాకోట్ పంచాయతీ పరిధిలోని సీఆర్పీసభ్యురాలు గీతాంజలి బుయ్యన్ను విధులు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ సోమవారం తెలిపారు. -
కూలీ పనికి వెళ్ళిన బాలిక, యువతి అదృశ్యం
[ 29-04-2024]
కూలీ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి బాలిక, యువతి అదృశ్యమైన ఘటన నవరంగపూర్ జిల్లా రాయ్ఘర్ సమితి మహడ గ్రామంలో చోటుచేసుకుంది. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్లో నవరంగపూర్కు కాంస్యం
[ 29-04-2024]
దుబాయిలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్లో నవరంగపుర్ జిల్లాకు చెందిన బాలుడు విజయం సాధించాడు. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్
[ 29-04-2024]
నవరంగపూర్ జిల్లాలో రాజకీయ పార్టీల ఎన్నికల సమావేశాలకు హాజరైనందుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. -
కుమారుడిని నరికి చంపిన తండ్రి
[ 29-04-2024]
నవరంగపూర్ జిల్లా నందపండి సమితి టెంటులిఘంటి పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండ్ర గ్రామంలో కన్న తండ్రి తన కుమారుడిని కత్తితో నరికి చంపిన ఘటన చర్చనీయాంశమైంది. -
20 క్వింటాల ఇప్ప పువ్వు స్వాధీనం
[ 29-04-2024]
జిల్లాలో ఆబ్కారీ, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
మగువ.. ప్రచారంలో తెగువ
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!