logo

వైభవంగా వేల్పులవీధి సారె సమర్పణ

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు గురువారం ఘనంగా జరిగింది. వివిధ రకాల పిండి వంటకాలతో ఊరేగింపు నిర్వహించారు. 83వ వార్డు కార్పొరేటర్‌ జాజుల ప్రసన్నలక్ష్మి

Published : 21 Jan 2022 04:10 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు గురువారం ఘనంగా జరిగింది. వివిధ రకాల పిండి వంటకాలతో ఊరేగింపు నిర్వహించారు. 83వ వార్డు కార్పొరేటర్‌ జాజుల ప్రసన్నలక్ష్మి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 22న జరగనున్న జాతరలో భాగంగా అమ్మవారికి సారె సమర్పించారు. తొలుత రామాలయం వద్ద మహిళలు తయారుచేసిన పిండి వంటకాలను ఉంచారు. అక్కడి నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొద్దపు ప్రసాద్‌, కార్యదర్శి యడ్ల గోవింద, ఉపాధ్యక్షులు రౌతు సతీష్‌, రవిశంకర్‌, సహాయ కార్యదర్శులు మద్దాల చిరంజీవి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని