విధినే ఎదిరించే.. విజయ శిఖరమే తలవంచే!
ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే.
వెంటాడిన పేదరికం
అయినా.. సివిల్స్ సాధనే ధ్యేయంగా కృషి
మేఘాలయ అదనపు డీజీపీ జి.హెచ్.పి.రాజు ప్రస్థానం
ఈనాడు, విశాఖపట్నం
ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే. అవేంటో.. విశాఖ వచ్చిన ఆయన మాటల్లోనే.
కారణం 1...
నాకు చదువులో బొటాబొటీ మార్కులే వచ్చేవి. ఇంటర్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. ఆ రోజుల్లో బీఎస్సీలో సీటురావడం కూడా కష్టమైంది.
నేను పెద్దగా చదవనని చాలా మంది హేళన చేసేవారు. ఓ మిత్రుడు సివిల్స్ వైపు దృష్టిపెడితే ఎలా ఉంటుందో చెప్పారో.. ఆ రోజే ఆ దిశగా నా ఆలోచన ఆరంభమయింది.
కారణం 2...
ఎన్నో కష్టాలు దాటుకొని డీఎస్పీగా ఎంపికైన తరువాత క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం విజయవాడ వెళ్లా.
ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఒక ఉన్నతాధికారి నాతోపాటు వచ్చిన ఇద్దరు శిక్షణ ఐ.పి.ఎస్.లను భోజనానికి పిలిచారు. నన్ను మాత్రం పిలవలేదు.
నాకు తలకొట్టేసినట్లైంది. ఆ రోజే సివిల్స్లో ర్యాంకు సాధించాలన్న పట్టుదల మరింత పెరిగింది.
ఉద్యోగాన్ని కాదనుకున్నా..
పీజీ పూర్తికాగానే ప్రభుత్వ ‘అటామిక్ మినరల్స్’ డివిజన్లో ఉద్యోగమిస్తామని పిలిచి.. ఇంటర్వ్యూలో నా లక్ష్యం ఏమిటని అడగ్గా... సివిల్స్కు సాధన చేస్తున్నానని చెప్ఫా ‘ఉద్యోగం తప్పకుండా ఇస్తాం. కానీ, సివిల్స్ సాధనకు అవకాశం ఉండదు. క్యాంపులకు వెళ్లాల్సి ఉంటుంది. నీ లక్ష్యాన్ని మరచిపోవాలి. ఆలోచించుకుని చెప్పు’ అన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ఆ ఉద్యోగం చాలా అవసరం. కానీ సివిల్స్ లక్ష్యం గుర్తొచ్చి ఉద్యోగం వద్దని చెప్ఫా
అలా సీటొచ్చింది...
ఇంటర్ తరువాత చాలా కాలేజీలకు దరఖాస్తు చేశా. గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ జియాలజీలో సీటు వచ్చింది. అప్పట్లో ఆ కోర్సు కొత్తగా పెట్టారు. సీట్లు మిగిలి నాకు అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో నా మిత్రుడు మన్నవ నాగేశ్వరరావు సివిల్స్లో ర్యాంకు సాధిస్తే జీవితానికి తిరుగుండదని చెప్పేవారు. డిగ్రీలో సీటు రావడమే కష్టమైన నాకు సివిల్స్ గురించి ఆలోచించడం అతిశయోక్తిగా అనిపించింది. కానీ, నన్ను హేళన చేసిన వారికి నేనేంటో నిరూపించాలన్న పట్టుదల పెరిగింది. డిగ్రీలో 80.8 శాతం మార్కులు సాధించా.
అలా.. ఏయూలో...
డిగ్రీ తరువాత ఏయూ జియాలజీ విభాగంలో ఎమ్మెస్సీ (టెక్) పూర్తి చేశా. అత్యుత్తమ మార్కులతో బంగారుపతకం కూడా సాధించా. పెద్దన్నయ్య ఎండీ, చిన్నన్నయ్య ఎంటెక్ చేస్తూ వారికి వచ్చే ఉపకారవేతనం నుంచి కొంత నాకు పంపేవారు. మిత్రులు కూడా ఆర్థిక సాయం చేస్తుండేవారు. అలా ఆర్థికంగా అండగా నిలిచారు.
అస్వస్థత నేపథ్యంలో..
డీఎస్పీగా శిక్షణ పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యా. ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సివిల్స్కు సాధన చేశా. జాతీయస్థాయిలో 65వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్. వచ్చే అవకాశం ఉన్నా ఐ.పి.ఎస్.నే ఎంచుకున్నా. అసోం, మేఘాలయ కేడర్ వచ్చింది. 1993 బ్యాచ్ ఐ.పి.ఎస్.గా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి, పదోన్నతులు పొంది ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నా. ప్రజలకు మరింతగా సేవ చేయాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో డిప్యుటేషన్పై పశుసంవర్థక, కార్మిక, సహకారశాఖల ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నా. నా భార్య అనిత స్వస్థలం విశాఖే. నా కుటుంబసభ్యులతోపాటు ఆమె ఇచ్చిన సహకారం మరువలేను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి.. ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
[ 06-05-2024]
ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
సాఫ్ట్‘వేరుకు వైకాపా వైరస్’
[ 06-05-2024]
విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఎంతో నైపుణ్యమున్న యువత బయటకు వస్తున్నారు. -
అదీ.. నాయకత్వం!!
[ 06-05-2024]
విశాఖకు ‘హుద్హుద్’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. -
‘వైకాపా పాలనలో సహజ వనరుల లూఠీ’
[ 06-05-2024]
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
కోడ్.. ఏమైంది?
[ 06-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. -
ప్రలోభాల ‘పోస్టల్ బ్యాలట్’...!
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రారంభమైంది. -
ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు : శ్రీభరత్
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. -
‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ -
అయిదేళ్లలో కాపులకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. -
ఏప్రిల్లో భారీ రికవరీ
[ 06-05-2024]
విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు. -
రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం
[ 06-05-2024]
ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధికి పరి‘శ్రమిస్తా’..!
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమితో పిల్లలకు బంగారు భవిత
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
రౌడీగా మారిన బూడికి బుద్ధి చెప్పండి
[ 06-05-2024]
కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
ఉచిత బస్సు ప్రయాణం: అనిత
[ 06-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
అదిరింది అయ్యన్నా!
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!