లబ్ధిదారుల నెత్తిన ధరా భారం
ఆనందపురం: ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జగనన్న కాలనీల్లో మొదటి విడతగా ప్రారంభించిన గృహాల నిర్మాణాలు కొన్నిచోట్లే వేగంగా పూర్తవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపు కావడంతో లబ్ధిదారులకు దిక్కుతోచడం లేదు. కొంద
ఇళ్ల నిర్మాణాలకు అష్టకష్టాలు
పెద్దిపాలెం వద్ద కొన్ని నిర్మాణాలు
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్టుడే, ఆనందపురం: ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జగనన్న కాలనీల్లో మొదటి విడతగా ప్రారంభించిన గృహాల నిర్మాణాలు కొన్నిచోట్లే వేగంగా పూర్తవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపు కావడంతో లబ్ధిదారులకు దిక్కుతోచడం లేదు. కొందరు వచ్చినా సగసగం చేసి మధ్యలో వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు తక్కువ అవ్వడం ధరలు
నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోతుండటతో గృహ నిర్మాణాలకు జంకుతున్నారు. ప్రభుత్వం పావలా వడ్డీ కింద రూ.35 వేల రుణం ఇప్పిస్తామని చెప్పినప్పటికీ అది కొందరికి మాత్రమే అందింది. క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసిన వారికి ఒక్కో ఇంటికి రూ.7 లక్షలకు పైగానే ఖర్చయిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. కూలీల ఖర్చు మొదలుకొని ఇటుకలు, ఇసుక రవాణా వంటి వాటితో అదనపు ఖర్చులు పెరిగిపోయాయంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
ఆనందపురం మండలం పెద్దిపాలెం పంచాయతీ లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్లో పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం , విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలి. ఇందులో 148 ఇళ్లు కట్టాల్సి ఉంది. ఇక్కడ పూర్తయినవి నాలుగు. గోడల వరకు అయినవి 20. పునాదుల వరకు అయినవి 20. దాదాపు 15 వరకు మధ్యలో ఉండిపోయాయి. మిగిలిన వారు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ స్థలాలు కొండ వాలు ప్రాంతంలో ఉండటంతో పునాదుల తవ్వడానికి యంత్రాలను వినియోగిస్తున్నారు. ఫలితంగా అదనపు ఖర్చు అవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్న ఓ లబ్ధిదారు మాట్లాడుతూ.. మౌలిక వసతులు త్వరితగతిన కల్పించాలన్నారు.
భీమిలి మండలం తాటితూరు రెవెన్యూలో గ్రామస్థులకు 300 వరకు ఇళ్లు కేటాయించారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు ప్రారంభంకాలేదు. స్థలాలు కేటాయించిన కొండను చదును చేసి వదిలేశారు.
ఆనందపురం మండలంలో ఎల్వీపాలెం, పొడుగుపాలెం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో లేఅవుట్లలో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ 200 ఇళ్లు కేటయించారు.. తహసీల్దార్ కార్యాలయం వెనుకున్న లేఅవుట్లో దాదాపు నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు గోడలు, పైకప్పు వరకు గృహాలు నిర్మించారు. కొండ ప్రాంతం కావడంతో పునాదుల తవ్వకానికి అదనపు ఖర్చు అవుతోందంటున్నారు. సిమెంటు, ఇసుక రవాణాకు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. పూర్తిస్థాయిలో మౌలికవసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. విద్యుత్తు సౌకర్యం, కొండ మీద నీటి వసతి పెంచాలంటున్నారు. రోడ్లు, కాలువలు తవ్వాల్సి ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో కేటాయించిన 140 ఇళ్లకు రెండే బోర్లు తవ్వారు. శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గొట్టాలు అమర్చుకొని పనులు చేస్తున్నారు.
ఖర్చు రెండింతలు పెరిగింది:
భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి నిర్మాణం విలువ అమాంతం పెరిగిపోయింది. ఇల్లు ప్రారంభించిన సమయంలో 4 వేల ఇటుక రూ.18 వేలుంటే ఇపుడు రూ.28 వేలు అయింది. కూలీల ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇక్కడ ఇంటిని మేస్త్రి గతంలో రూ.1.60 లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. ఇప్పుడు రూ.2.60 లక్షలు అడుగుతున్నారు. దీనికి సామగ్రి కొనుగోళ్లు అదనం. ప్రభుత్వం ఇచ్చిన సాయం సరిపోకపోవడంతో అప్పు చేసి నిర్మాణం పూర్తిచేస్తున్నాం. - ప్రసాద్, పొడుగుపాలెం
విద్యుత్తు సౌకర్యం కల్పించాలి:
మా ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. బిల్లు అయినంత వరకు చెల్లించేశారు. ఇక్కడ లేఅవుట్లో పూర్తిస్థాయి విద్యుత్తు సౌకర్యం కల్పించాలి. రోడ్లు, కాలువలు త్వరితగతిన నిర్మిస్తే ఇంటిలో దిగిపోతాం. తగిన వసతులు వెంటనే కల్పించాలి. - లలిత, ఆనందపురం
నీరు కొనుక్కున్నాం:
ఈ లేఅవుట్లో మొదట ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయానికి అధికారులు బోర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ట్యాంకులతో నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసమే సుమారు రూ.50 వేల వరకు అదనంగా ఖర్చయిపోయింది. ఆ తరువాత బోరు ఏర్పాటు చేశారు. కూలీల ఖర్చులు పెరగడంతో మధ్యలో మూడు నెలలు పనులు ఆపేశాం. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేశాం. రూ.9 లక్షల వరకు ఖర్చయింది. అప్పు చేసి నిర్మించాం. - సింహాచలం, పెద్దిపాలెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!