వీధి దీపాలు, కాల్వలపై అధికంగా ఫిర్యాదులు
స్పందన అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ మల్లికార్జున
కార్పొరేషన్, న్యూస్టుడే: స్పందన అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో కార్యక్రమంలో కలెక్టర్, జేసీ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 225 వినతులను అందజేశారు. అనంతరం సమావేశ మందిరంలో స్పందన దరఖాస్తుల పరిష్కారం, ఇతర అంశాలపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. అర్జీలను స్పందన పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలను సంబంధిత శాఖల అధికారులు తరచూ తనిఖీ చేయాలన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పనులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పనులకు ప్రాధాన్యతల వారీగా టెండర్లు ఆహ్వానించి ప్రారంభించాలన్నారు. స్పందనలో జీవీఎంసీపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీధి దీపాలు, కాలువల నిర్వహణ, మంచినీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారంపై జీవీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జీవీఎంసీ ‘స్పందన’కు 67...
సమస్యలు వింటున్న మేయరు గొలగాని హరి వెంకట కుమారి
కార్పొరేషన్, న్యూస్టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 67 అర్జీలు వచ్చాయి. మేయరు గొలగాని హరి వెంకట కుమారి వాటిని స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్-2కు 15, మూడో జోన్కు 11, నాలుగో జోన్కు ఏడు, జోన్-5కు 10, జోన్-6కు 17, జోన్-8కు మూడు, ప్రధాన కార్యాలయానికి నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. వీటిలో పరిపాలన విభాగానికి సంబంధించి మూడు, రెవెన్యూకు 9, ప్రజారోగ్య విభాగానికి మూడు, పట్టణ ప్రణాళికకు 33, ఇంజినీరింగ్కు 8, యూసీˆడీకి 11 చొప్పున ఉన్నాయి. అంతకు ముందు నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి 27 వినతులు వచ్చాయి.
రహదారి నిర్మించకుండా టీడీఆర్ ఎలా ఇస్తారు?: జనసేన
జేసీ విశ్వనాథన్కు వినతిపత్రం ఇస్తున్న మూర్తియాదవ్
కార్పొరేషన్, న్యూస్టుడే: విశాఖలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం జేసీ విశ్వనాథన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సీబీసీఎన్సీ భూములను కాపాడాలని, అక్రమంగా ఇచ్చిన టీడీఆర్ను రద్దు చేయడంతోపాటు జీవీఎంసీ కమిషనర్పై చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు కలసి సీబీసీఎన్సీ, సాంఘిక సంక్షేమశాఖ స్థలాలను కాజేస్తున్నారని ఆరోపించారు. ఆధారాల సహా సంయుక్త కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రోడ్డు వేయకుండా, డోర్ నెంబరు లేకుండా తప్పుడు జీఓ 345తో రూ.62కోట్ల విలువైన టీడీఆర్ను కమిషనర్ ఇచ్చారని ఫిర్యాదు చేశామన్నారు. సీబీసీఎన్సీ భూములు 18 సంస్థలకు చెందితే, ఒక వ్యక్తి పేరిట టీడీఆర్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సర్వే నెంబరు 75-4లో సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహం ఏమైందో కలెక్టర్ నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జనసేన నాయకులు శ్రీనివాస పట్నాయక్, శివప్రసాద్, రామకృష్ణ, కృష్ణ, రవి, వీర మహిళలు రూప, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు 42 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ బాపూజీ
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఉత్తర్వులతో సోమవారం పోలీసు సమావేశమందిరంలో నిర్వహించిన స్పందనలో పలువురు పాల్గొని సుమారు 42 అర్జీలు అందజేశారు. ఈ స్పందనను ఏసీపీ(ఎస్సీ, ఎస్టీ సెల్) బాపూజీ నిర్వహించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు కమిషనర్ శ్రీకాంత్, డీసీసీలు, ఏడీసీపీలు, ఏసీపీలతో పాటు అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని సి.ఐ.లు, ఎస్.ఐ.లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్పందనకు సుమారు 42 మంది ఫిర్యాదుదారులు హాజరై, తమ ఫిర్యాదులను తెలియజేసి సంబంధిత వినతులను సమర్పించారు. వీరితో ఏసీపీ బాపూజీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సీపీ శ్రీకాంత్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్ల పోలీసు అధికారులతో మాట్లాడి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వనవిహార్ భూములపై విచారణకు వినతి
కార్పొరేషన్, న్యూస్టుడే: విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అటవీశాఖకు చెందిన వన విహార్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపెళ్ల పైడిరాజు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వన విహార్ భూములను పరిశీలించడానికి వెళ్లిన సీపీఐ నాయకులను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేటకు చేరుకుని జేసీ విశ్వనాథన్ను కలిసి ఫిర్యాదు అందించారు. వన విహార్ బ్లాక్ నెంబరు 12, సర్వే నెంబరు 88లో 3.60ఎకరాల భూమిపై వివాదం నెలకొందని, కొందరు దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని పైడిరాజు ఆరోపించారు. ఆయా భూములును పరిశీలించడానికి వెళితే అడ్డుకుంటున్నారన్నారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?