logo

పోలీసుల విస్తృత తనిఖీ

పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు నేర నియంత్రణలో భాగంగా రాత్రి సమయంలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

Published : 09 Dec 2022 05:42 IST

వాహనదారులను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు నేర నియంత్రణలో భాగంగా రాత్రి సమయంలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతలు, క్రైమ్‌, మొబైల్‌ పోలీసు సిబ్బంది రాత్రి సమయంలో సుమారు 255 వాహనాలను తనిఖీలు జరిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 27 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని 210 ఆటో డ్రైవర్లపై, మోటారు వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1451 కేసులు నమోదు చేశారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒకరిని అరెస్టు చేసి అతని నుంచి 1.7 కిలోల గంజాయి, ఎంవీపీ స్టేషన్‌ పరిధిలో ఒకరిని అరెస్టు చేసి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని