విధేయులకు ఎమ్మెల్సీ పదవులు
వైకాపా అధిష్ఠానానికి విధేయులుగా ఉన్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన మత్స్యకార నేత, వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులును ఎమ్మెల్యేల కోటా కింద
వన్టౌన్, న్యూస్టుడే: వైకాపా అధిష్ఠానానికి విధేయులుగా ఉన్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన మత్స్యకార నేత, వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులును ఎమ్మెల్యేల కోటా కింద, రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. సోమవారం ఉదయమే ఇద్దరు నేతలకు పార్టీ నుంచి పిలుపు రావడంతో వెంటనే విజయవాడ వెళ్లారు. కీలక పదవులు దక్కడంతో ఆనందం వ్యక్తం చేశారు.
* రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగుతున్న కోలా గురువులు ప్రారంభం నుంచి వైకాపాలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తొలిసారి 2009లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. తదుపరి వైకాపాలో చేరారు. అప్పటి నుంచి అందులోనే కొనసాగుతున్నారు. దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్కుమార్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో ద్రోణంరాజు శ్రీనివాసరావుకు దక్షిణ టికెట్ ఇచ్చారు. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో 2020 డిసెంబరులో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని గురువులుకు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని కోలా గురువులు పేర్కొన్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
* ఏయూలో ఆచార్యునిగా పనిచేసిన కె. రవిబాబు పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎస్.కోట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తదుపరి తెదేపాలో కొంత కాలం పని చేసి వైకాపాలోకి మారారు. 2014, 2019 ఎన్నికల్లో అరకు టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. తర్వాత రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఇప్పుడు తాజాగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది.