logo

జాతీయ తైక్వాండో పోటీలకు ఐదుగురి ఎంపిక

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎలమంచిలికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు.  స్కూల్‌గేమ్స్‌ జాతీయ పోటీలకు యు.జయశ్రీ, రొట్ట పల్లవి, ఎల్‌.లహరిలు ఎంపికయ్యారు.

Published : 03 Jun 2023 03:32 IST

పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో కోచ్‌

ఎలమంచిలి, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎలమంచిలికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు.  స్కూల్‌గేమ్స్‌ జాతీయ పోటీలకు యు.జయశ్రీ, రొట్ట పల్లవి, ఎల్‌.లహరిలు ఎంపికయ్యారు. గత ఏడాది డిసెంబరులో కడప జిల్లా రైల్వేకోడూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు ముగ్గురు బంగారు పతకాలు సాధించారు. ఈనెల 8 నుంచి 10 వరకూ డెహ్రాడూన్‌లో తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే  ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గొల్లవిల్లి విజయ్‌కుమార్‌, తుంపాల శ్వేత, పాల్గొంటారన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు బంగారు పతకాలు సాధించి ఈ ఇద్దరు జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. వీరి ఎంపిక పట్ల అకాడమీ ఫౌండర్‌ నగిరెడ్డి సత్యనారాయణ, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.అచ్యుతరెడ్డి, సహయ కార్యదర్శి వేణుగోపాలరావు, కోశాధికారి అర్జునరావు, తదితరులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని