జగన్ సభ ఎఫెక్ట్.. బస్సు ఎక్కి దిగితే రూ.65
సీఎం జగన్ బహిరంగ సభ పుణ్యమా! అని ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది.
రూటు మార్చడంతో ప్రయాణికులకు వాత
ఈనాడు అనకాపల్లి, ఎలమంచిలి, న్యూస్టుడే: సీఎం జగన్ బహిరంగ సభ పుణ్యమా! అని ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన బస్సులు అచ్యుతాపురం వైపు దారి మళ్లించారు. బస్సు ఎక్కి దిగితే రూ.65 చెల్లించాల్సి ఉంటుందని కండక్టర్లు చెప్పడంతో ప్రయాణికులు కంగుతిన్నారు. చాలా మంది బస్సులు దిగి ఆటోలను ఆశ్రయించారు. పిసినికాడలో సీఎం సభ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా నర్సింగబిల్లి, తాళ్లపాలెం, బయ్యవరం, అనకాపల్లి వెళ్లాల్సిన వారు ఎలమంచిలి, నారాయణపురం, అచ్యుతాపురం, మునగపాక మీదుగా అనకాపల్లి వెళ్లాల్సి వచ్చింది.
బస్సులు చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల ఎలమంచిలిలో ఎక్కి కూర్మన్నపాలెం మధ్య ఎక్కడ దిగినా రూ.65 చెల్లించాల్సిందేనని కండక్టరు స్పష్టం చేశారు. ఎలమంచిలి నుంచి నారాయణపురం, అచ్యుతాపురం మీదుగా వెళ్లేవారు నేరుగా కూర్మన్నపాలెం వరకూ టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో నారాయణపురం వెళ్లాల్సిన వారు 3 కి.మీ. దూరానికి రూ.65 చెల్లించాలా అంటూ బస్సులు దిగిపోయారు. మరోవైపు బస్సుల కోసం ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూశారు. జాతీయ రహదారిపై ప్రయాణించే బస్సులు అచ్యుతాపురం మీదుగా వెళ్లాలన్న సమాచారం లేకపోవడంతో నిలిపివేశారు. ప్రయాణికుల నుంచి ఒత్తిడి పెరగడంతో డిపోమేనేజర్లకు ఫోన్ చేసి వారి నుంచి అనుమతి వచ్చాక కొన్ని బస్సులు చుట్టూ తిరిగి ప్రయాణించాయి. కొన్ని డిపోల నుంచి అనుమతులు రాకపోవడంతో మధ్యాహ్నం వరకూ బస్సులు కాంప్లెక్స్లోనే ఉన్నాయి. సభ ముగిసిన తర్వాతా జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.