logo

కూపను ఇచ్చుకో.. వెయ్యి పుచ్చుకో..

పదోవార్డు పరిధిలోని ఎస్‌ఐజీ.నగర్‌ రామలింగేశ్వర కల్యాణ మండపం వద్ద వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మనుషులుగా భావిస్తున్న కొందరు శనివారం రాత్రి కూపన్లు పంపిణీ చేసినట్లు తెలిసింది.

Updated : 17 Mar 2024 08:50 IST

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: పదోవార్డు పరిధిలోని ఎస్‌ఐజీ.నగర్‌ రామలింగేశ్వర కల్యాణ మండపం వద్ద వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మనుషులుగా భావిస్తున్న కొందరు శనివారం రాత్రి కూపన్లు పంపిణీ చేసినట్లు తెలిసింది. కాలనీ వాసులకు భోజనాలు పెట్టించి ఆ కూపన్లు ఉన్నవారికి రూ. వెయ్యి చొప్పున అందించినట్లు తెలిసింది. మహిళలకు గతంలోనే చీరలు అందించినందున పురుషులకు కూపన్లు అందించి వాటిని తీసుకువచ్చిన వారికి రూ. వెయ్యి అందించారంటున్నారు. రహస్యంగా ఈ కార్యక్రమం జరిగినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ వచ్చిన తొలిరోజునే ఇలా వ్యవహరిస్తే పట్టించుకోవాల్సిన అధికారగణం ఏమి చేస్తున్నట్లు పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని