logo

కష్టపడిన వారందరికీ గుర్తింపు: అయ్యన్న

ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెదేపా అధికారంలో రావడం ఖాయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు.

Published : 16 Apr 2024 04:11 IST

తెదేపా నాయకులతో కలిసి మాజీ మంత్రి అయ్యన్నకు పుష్పగుచ్ఛం ఇస్తున్న తాతయ్యబాబు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెదేపా అధికారంలో రావడం ఖాయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన బత్తుల తాతయ్యబాబు సోమవారం సాయంత్రం ముఖ్య నాయకులతో కలిసి నర్సీపటంలో అయ్యన్నను కలిశారు. వారినుద్దేశించి అయ్యన్న మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులందరికీ చంద్రబాబునాయుడు తగిన గుర్తింపు ఇస్తారని భరోసా ఇచ్చారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావడానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు