అభిమాన ప్రభం‘జనం’
పాయకరావుపేట తెదేపాకు పెట్టని కోటని రుజువైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం సభకు జనం పోటెత్తి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.
జోష్ నింపిన అధినేత పర్యటన
గెలుపుపై కూటమి నేతల్లో ధీమా
అభ్యర్థులు అనిత, రమేష్లను సభలో పరిచయం చేస్తున్న చంద్రబాబు
పాయకరావుపేట, న్యూస్టుడే: పాయకరావుపేట తెదేపాకు పెట్టని కోటని రుజువైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం సభకు జనం పోటెత్తి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎన్నడూలేని విధంగా వేలాదిగా అభిమాన జనం తరలిరావడంతో కూటమిలోనూ హుషారు నెలకొంది. పాయకరావుపేట పట్టణం పూర్తిగా ఆదివారం జనంతో నిండిపోవడం చూసి తెదేపా, జనసేన, భాజపా నాయకుల్లో ఉత్సాహం రెట్టింపైంది. చంద్రబాబు పర్యటన రెండు గంటలు ఆలస్యమైనా జనం ఓపికతో వేచి ఉండటంతోపాటు ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. సభ ముగిసే వరకు జనం వేచి ఉన్నారు. తెదేపా ప్రకటించిన మేనిఫెస్టోలోని మహిళా శక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం తదితర పథకాలు ప్రకటిస్తున్న సమయంలో జనం నుంచి పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కూటమి నాయకులు సమష్టిగా శ్రమించడంతో మూడు పార్టీల కార్యకర్తలు, జనం ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు. చంద్రబాబును చూసేందుకు పట్టణవాసులు సైతం తరలివచ్చారు. భవనాలపైకి చేరుకుని ఆయన్ని తిలకించారు. జిల్లాలో తొలిసారిగా ఎన్నికల ప్రచార శంఖారావానికి పాయకరావుపేట నుంచి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పర్యటన విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. వంగలపూడి అనితను గెలిపించి అసెంబ్లీకి, సీఎం రమేశ్ను పార్లమెంటుకు పంపించాలని నాయకులకు సూచించారు. కోటవురట్ల, పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల నుంచి ర్యాలీగా వచ్చిన జనంతో పేట జనసంద్రాన్నే తలపించింది. ప్రధాన రహదారి సహా మంగవరం రోడ్డు, బృందావనంలోని దుర్గాలమ్మ చెట్టు వీధి, మిగతా రోడ్లు జనంతో నిండిపోయాయి. ఇప్పటికే మూడు పార్టీల నాయకులు, కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళుతూ పార్టీ ప్రకటించిన పథకాలను వివరిస్తున్నారు. అంతేగాక మరో పక్క కూటమి నాయకులు ఆయా మండలాల పరిధిలో విడివిడిగా ప్రచారాన్ని చేపడుతున్నారు. పేటలో భారీ మెజారిటీతో విజయాన్ని సాధించాలనే సంకల్పంతో నాయకులు పనిచేస్తున్నారు. పాయకరావుపేట నుంచి వైకాపా నాయకుడు గూటూరు శ్రీనివాసరావు సహా పాల్మన్పేట, పాల్తేరు, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల నుంచి పార్టీలోకి భారీగా వైకాపా క్యాడర్ చేరుతున్నారు. దీంతో వైకాపాలోనూ బేజారు మొదలైంది.
హాజరైన జనసందోహం
వైకాపా పాలనలో దళితులకు అన్యాయం
మాట్లాడుతున్న రమేశ్
అనకాపల్లి, న్యూస్టుడే: వైకాపా పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ తెలిపారు. తెదేపా ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ నిర్వహించిన దళితుల ఆత్మీయ సమేళనంలో ఆయన మాట్లాడారు. దళితల సంక్షేమం కోసం తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 27 పథకాలను వైకాపా రద్దు చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలను తిరిగి అమలు చేస్తామన్నారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. ఈ కార్యక్రమానికి గణేష్ అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, జనసేన నాయకులు దూలం గోపి, పావాడ కామరాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్