బిగ్గరగా అరిచావ్.. ఆర్టీసీని మరిచావ్
ఏదైనా అత్యవసరపనిపై వెళ్లేందుకు ఆర్టీసీ బస్సెక్కితే దిగే వరకూ దడే!! మొదట ఛార్జీ ఎంతో తెలియగానే ఆందోళన రేగుతుంది! ఇంతలో ఆ బస్సు చక్రమైనా ఊడిపోవచ్చు...స్టీరింగ్ అయినా పట్టేయొచ్చు!
డొక్కుగా మారిన బస్సులనే తిప్పిన జగన్ సర్కార్
ఎక్కడికక్కడ ఆగిపోతున్న దుస్థితి
ఛార్జీల పెంపు ఆపని ప్రభుత్వం
కొత్త బస్సుల్లో ప్రయాణయోగం లేని నగర వాసులు
ఈనాడు, విశాఖపట్నం
ఏదైనా అత్యవసరపనిపై వెళ్లేందుకు ఆర్టీసీ బస్సెక్కితే దిగే వరకూ దడే!! మొదట ఛార్జీ ఎంతో తెలియగానే ఆందోళన రేగుతుంది! ఇంతలో ఆ బస్సు చక్రమైనా ఊడిపోవచ్చు...స్టీరింగ్ అయినా పట్టేయొచ్చు! మంటలైనా రేగొచ్చు....వర్షం పడితే నీళ్లు లోపలికి రావొచ్చు..అద్దాలు కూడా లేకపోవచ్చు...అసలు ఏమయిందో తెలియకుండా అలాగే నడిరోడ్డుపై అప్పటికప్పుడు ఆగిపోవచ్చు!! దీంతో మరింత గుండెదడ పెరుగుతుంది!! ఇదంతా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనా పుణ్యమే. కొత్తబస్సులు కొనుగోలు చేయడంలో అంతులేని తాత్సారం చేశారు. ఆర్టీసీని, ఉద్యోగులను ఉద్ధరిస్తానని ప్రతిపక్ష నేతగా గట్టిగా చెప్పారు. కానీ, కాలం చెల్లిన బస్సులతో ఐదేళ్లు గడిపారు.అసలు కొత్త బస్సుల్లో ప్రయాణిస్తామా...ఆ యోగం మనకు ఉందా అని నగర వాసుల్లో చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో తగిన తీర్పు ఇస్తేనే అది జరుగుతుందంటున్నారు.
తరచూ మరమ్మతులు: ఆర్టీసీ ఛార్జీలను మూడుసార్లు పెంచేసిన వైకాపా ప్రభుత్వం డొక్కు బస్సులను రోడ్డెక్కించి జనం బతుకులతో చెలగాటమాడుతోంది. తుక్కు కింద వెళ్లాల్సిన వాటిని నడుపుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు మూడు లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఏ ప్రమాదానికి గురవుతాయో తెలియక సిబ్బంది ఆందోళనగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం పలు సిటీ బస్సులు మరమ్మతుకు గురై ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మొత్తం బస్సుల్లో సగానికిపైగా పరిమితికి మించి తిరిగినవే ఉన్నాయి. ఏసీ బస్సుల్లో 70 శాతం బస్సులు 15 లక్షల కి.మీ.పైగా తిరిగాయి. దూర ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో బ్రేక్డౌన్స్ తరచూ పెరిగిపోయాయి. వాస్తవానికి 15 ఏళ్లు దాటినవి తుక్కు కింద పడేయాలి. కొన్నింటిని 15 ఏళ్లు కాలేదని తిప్పుతున్నారు.
- మరమ్మతులకు గురైనవాటిని వర్క్షాపులకు పంపితే భారీగా ఖర్చవుతుందని స్థానికంగా తక్కువ ఖర్చుతో పనులు చేయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
- నిబంధనల ప్రకారం ప్రతి మూడు బస్సులకు ఒక మెకానిక్ అందుబాటులో ఉండాలి. తగిన సిబ్బంది లేక ఇబ్బందులు వస్తున్నాయి. శిక్షకులు, పొరుగుసేవల ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నారు.
ఆగితే కదలదు...అందుకే ఇలా
బస్సు.. దాని చుట్టూ జనం ఉన్నారేంటని ఆలోచిస్తున్నారా..! అప్పటివరకు ఆ బస్సులో ప్రయాణించినవారే వీరు.అకస్మాత్తుగా ఆగిపోవడంతో కిందికి దిగి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బీచ్రోడ్డులో ప్రయాణికులకు ఎదురైన కష్టమిది.
కొన్ని ఘటనలు ఇలా
- జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి పైవంతెన మీద బస్సు దగ్ధమైంది. వెనుక టైరు నుంచి మంటలు రేగి వ్యాపించాయి. చక్రం రిమ్ లోపం వల్ల మంటలు వచ్చాయని అప్పట్లో నిర్ధారించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించగా పెను ముప్పు తప్పింది.
- బీచ్ రోడ్డులోని గోకుల్ పార్క్ వద్ద స్టీరింగ్ పట్టేయడంతో బస్సు ఫుట్పాత్పైకి దూసుకుపోయింది.
- విశాఖ నుంచి దేవరాపల్లి వెళ్తున్న బస్సు కొత్తవలస దాటాక చక్రం ఊడిపోయి ఒరిగిపోయింది.
సింహాచలం - విజయనగరం మార్గంలో ప్రయాణిస్తున్న ఓ బస్సు చక్రం అకస్మాత్తుగా ఊడి పడింది. బస్సు అలాగే కొద్దిదూరం ముందుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్