యువశక్తి హోరు.. తెదేపా శ్రేణుల్లో జోరు
తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. నర్సీపట్నం పురపాలక పరిధిలోని బలిఘట్టంలో మంగళవారం రాత్రి యువశక్తి పేరిట కూటమి నేతలు నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. బ్రెజిల్ నుంచి 25వేల టన్నుల మాదకద్రవ్యాలు విశాఖపట్నానికి తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. ‘మద్య నిషేధాన్ని తీసుకు వస్తామని చెప్పిన జగన్ ఈ ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు మద్యాన్ని అమ్మించారు. ఉద్యోగాలను నిస్సిగ్గుగా బహిరంగ మార్కెట్లో వేలం వేసిన వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెదేపా యువనేత విజయ్ పేరు వింటే ఎమ్మెల్యే గణేష్ ప్యాంట్ తడుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మేనిఫెస్టోలో జగన్ మోసపూరిత హామీలతో యువతను దగా చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. తెదేపా పాలనలో 40 నైపుణ్య శిక్షణ కేంద్రాలు నడిచేవని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గణేష్ తాడేపల్లి వెళ్లి సెల్ఫీ తీసుకోవడం తప్ప ఐదేళ్లలో ఏమైనా చేశాడా అని నిలదీశారు. అయ్యన్న అవినీతి లేని పాలన అందించారని పేర్కొన్నారు.
సీఎంతో మాట్లాడి రాష్ట్రంలో ఎనభై పాలిటెక్నిక్ కళాశాలలు ఒకేసారి ఏర్పాటు చేసిన ఘనత అయ్యన్నదని గుర్తు చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి రాజమండ్రి-విజయనగరం నాలుగు లైన్ల రహదారి కార్యరూపం దాల్చేలా చేసిన వ్యక్తి అయ్యన్న అన్నారు. తెదేపా పాలనలో నర్సీపట్నంలో ప్రాంతీయ ఆసుపత్రి ప్రసవాల్లో రికార్డు సృష్టిస్తే వైకాపా పాలనలో సెల్ఫోన్ల వెలుగులో ప్రసవాలు చేసే దుస్థితికి దిగజార్చారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు రూ.13 వేల కోట్లు ఆర్థికసంఘం నిధులు పక్కదారి పట్టించి తాడేపల్లి ప్యాలెస్కు చేర్చారని ఆరోపించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్ కామెడీని మించి పోయిందని ఎద్దేవా చేశారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ప్రసంగిస్తూ ఇథనాల్ పరిశ్రమలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. యువనేత వంగవీటి రాధా మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ఎంత మేలు జరిగిందో కాదు... మీ ఇంటికి ఎంత మేలు జరిగిందో ప్రజలకు చెప్పాలని సీఎం జగన్ను నిలదీశారు. జగన్ను నమ్మి యువత మోసపోయిందన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, పుచ్చా విజయ్కుమార్, అద్దేపల్లి గణేష్ తదితరులు ప్రసంగించారు కూటమి నాయకులు బోళెం రామప్రసాద్, సురేంద్ర మోహన్, సూర్యచంద్ర పాల్గొన్నారు.
బలిఘట్టం పసుపుమయం
బలిఘట్టం మంగళవారం సాయంత్రం పసుపు మయమైంది. ఎటు చూసినా ఉత్సాహమే... తలపై టోపీలు... మెడలో కండువాలుతో యువకులు ఉరకలేస్తూ వేలాదిగా తరలివచ్చారు. తెదేపా, భాజపా నాయకుల ప్రసంగాలు కొనసాగుతున్నంత సేపూ ఈలలు, కేరింతలతో ఆద్యంతం సందడి చేశారు. యువశక్తి పేరిట నిర్వహించిన ఈ సభకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అధ్యక్షత వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్