ఇంటింటికి అన్నారు.. వీధుల్లో పెట్టారు
చౌక ధరల దుకాణాల్లో రేషను సరకులు తీసుకునే లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లకుండానే.. ఇంటి ముంగిటకే సరకులు చేరవేస్తాం. ఇంటింటికీ వచ్చి సరకులు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేశారు.
ఎండీయూ వాహనాల దుస్థితి
అరకొర సరకుల పంపిణీ
పెందుర్తి, సబ్బవరం, వేపగుంట, పరవాడ, న్యూస్టుడే
చౌక ధరల దుకాణాల్లో రేషను సరకులు తీసుకునే లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లకుండానే.. ఇంటి ముంగిటకే సరకులు చేరవేస్తాం. ఇంటింటికీ వచ్చి సరకులు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేశారు. ఎండీయూ వాహనాల ద్వారా సరకులు పంపిణీని ప్రారంభించి వీధి చివరి చెట్ల కింద, రోడ్డు పక్కన మండుటెండలో లబ్ధిదారులను నిలబెడుతున్నారు. వాహనం వచ్చిన రోజు సరకులు తీసుకోలేకపోతే ఇక ఆ నెలకు సరకులు లేనట్లే. ఇవన్నీ వైకాపా పాలనలోని అవస్థలే.
కందిపప్పు అందడం లేదు: రేషన్ పంపిణీలో ఎప్పుడు ఏ సరకులు దొరుకుతాయో తెలియని పరిస్థితి. పంచదార, కందిపప్పు దొరకడం లేదు. బయట మార్కెట్లో కొనుగోలు చేయడం భారంగా మారింది. రోడ్డుపైన నిలబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతినెలా ఒకే సమయంలో రేషను బండి రావడం లేదు.
టి.వరలక్ష్మి
చోడిపిండి కావాలంటే.. బియ్యం వదులుకోవాల్సిందే..: వాహనం ఎప్పుడొస్తే అప్పుడే సరకులు తీసుకోవాలి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే కుదరడం లేదు. బండి వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. బియ్యం మా దగ్గర తీసుకుని చోడిపిండి కావాలంటే మరో రూ.11 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బి.పద్మ
పనులు మానుకొని వేచి ఉండాల్సి వస్తోంది: ఎండీయూ వాహనాలకు సమయపాలన ఉండట్లేదు. పనులు మానుకుని సరకులు కోసం వేచి ఉండాల్సి వస్తోంది. గతంలో ఖాళీ సమయం చూసుకుని రేషన్ డిపోలకు వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. వచ్చిన రోజు తీసుకోకపోతే తర్వాత రోజు సరకుల కోసం వేరొక ఊరుకి వెళ్లాల్సి వస్తోంది. సర్వర్ పని చేయకపోతే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
యలమంచిలి మంగమ్మ, యలమంచిలిదొడ్డి
సరకుల్లో కోత విధించారు: ప్రస్తుతం బియ్యం, పంచదార తప్ప మిగతా సరకులు ఇవ్వడం లేదు. గతంలో కందిపప్పుతో పాటు తదితర సామగ్రి ఇచ్చేవారు. సంక్రాంతి కానుక, రంజాన్తోఫా, క్రిస్మస్ కానుక పేరిట చంద్రబాబు హయాంలో పేదలకు సరకులు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటివేమీ ఇవ్వట్లేదు.
సీహెచ్ ముత్యాలరావు, ముత్యాలమ్మపాలెం
గతంలోనే మేలు..: ఇప్పటి కంటే గతంలోనే రేషన్ పంపిణీ బాగుండేది. ఎండీయూ వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఆ సమయంలో లేకపోతే ఇంకా కష్టమే. ప్రభుత్వం ప్రకటించిన 16 రకాల సరకులు అక్కడ ఉండట్లేదు. ఈ మాత్రం దానికి అంత హంగామా అవసరమా.
ఉప్పాడ సత్యవతి సబ్బవరం
ఇంటింటికి ఎప్పుడూ తెచ్చి ఇవ్వలేదు: ఇంటింటికి బియ్యం అందజేయడానికి ఎండీయూ వాహనాలను వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆవాహనాలు ఎప్పుడూ ఇంటింటికి రావడం కనిపించలేదు. ఏదో ఒకచోట సిగ్నల్ వచ్చిన చోట వాహనాన్ని ఆపి అక్కడకు కార్డుదారులందరినీ రమ్మని బియ్యం పంపిణి చేయడం జరుగుతుంది. పాతపద్దతికి, కొత్తపద్దతికి ఎక్కడా మార్పుకనిపించలేదనే చెప్పవచ్చు.
చందక అప్పయ్యమ్మ, వృద్ధురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్