జగన్ పంపిన బండి... జనం గుండె మండి!!
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేషను సరకుల పంపిణీ తయారైంది. సీఎం నిర్ణయం ప్రకారం మల్టీ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలు జిల్లాకు వచ్చాయి.
ఇదేం పంపిణీ అంటూ ఆగ్రహం
రేషన్ లబ్ధిదారులకు అష్టకష్టాలు
మరో వైపు... వాహన ఆపరేటర్ల చేతివాటం
ఎండ చుర్రుమంటున్నా.. వర్షం కురుస్తున్నా... మంచు పడుతున్నా.... చీకట్లోనైనా...
రేషన్ బియ్యం, ఇతర సరకుల నిమిత్తం జనం బారులు తీరాల్సిందే.
వైకాపా ప్రభుత్వంలో రేషన్ కోసం లబ్ధిదారులు పడిన కష్టాలు అన్నీఇన్నీకాదు.
పిల్లలు, మహిళలు, వృద్ధులు సంచులు పట్టుకొని నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. గుమ్మం ముందుకే వాహనం వస్తుందని ఆకాశం అదిరిపోయేంత స్థాయిలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్... అసలు అలా జరుగుతుందా అన్న విషయమే సమీక్షించలేదు. అందుకే లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో డీలరు వద్దకు వెళ్లి తెచ్చుకునేవారు. అలాకాకుండా ఇంటికే తెచ్చిఇస్తారని చెబితే నమ్మిన జనం ప్రస్తుత పరిస్థితులు చూసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధిచెబితేనే ఈ విధానం మారుతుందని చెబుతున్నారు.
గతంలో..
ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో రేషను డిపోకు వెళితే ఇచ్చేవారు.
ప్రస్తుతం
వాహనం వచ్చిన తర్వాత వెంటనే తీసుకోకపోతే ఇంక అంతే.
వన్టౌన్, న్యూస్టుడే: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేషను సరకుల పంపిణీ తయారైంది. సీఎం నిర్ణయం ప్రకారం మల్టీ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలు జిల్లాకు వచ్చాయి. సరకులు మాత్రం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లడం లేదు. నడిరోడ్డుపై, సందుల్లో, ఎక్కడో తనకు తెలిసిన ప్రదేశంలో వాహనం నిలిపి అక్కడికి వచ్చి తీసుకోవాలని పలువురు ఎండీయూ ఆపరేటర్లు హుకుం జారీ చేసే పరిస్థితి నెలకొంది. అంతేనా...‘కిలో బియ్యంకు రూ.10 నుంచి రూ.13లు ఇస్తాం. మాకు ఇచ్చేయండి. ఒక వేళ ఇవ్వకుంటే మీరే పదిసార్లు వాహనం చుట్టూ తిరగాల్సి ఉంటుంది’ అనే హెచ్చరికలూ వస్తున్నట్లు సమాచారం.
డీలరు నుంచి అవసరమైన సరకులు తీసుకొని ఎండీయూ ఆపరేటరు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలన్నది నిబంధన. ఈ క్రమంలో ఈ వాహనాలతో మేలు కన్నా నష్టమే ఎక్కువగా ఉందని జనం వాపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏరికోరి తెచ్చిన వీటి ద్వారా సరకుల పంపిణీ ఒక మాయగా మారింది. అక్రమాలకు అడ్డగా మారింది. పేదల బియ్యం నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకొనేందుకు ఈ వ్యవస్థ అవకాశంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి.
అక్రమాలు ఇలా: లబ్ధిదారుల నుంచి కొందరు ఆపరేటర్లు బియ్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించి కిలో రూ.20ల చొప్పున విక్రయిస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. కొందరు ఒకేసారి డీలరు నుంచి 50 క్వింటాళ్ల బియ్యం తీసుకుంటున్నారు. ఆ సరకంతా వాహనంలో పట్టదు. అందుకే 20 క్వింటాలు డీలరు వద్దే ఉంచుతారు. ఆ తరువాత కొందరు మొత్తం పంపిణీ చేసినట్టు కార్డుహోల్డర్ల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నారు. డీలరు వద్ద ఉంచిన 20 క్వింటాళ్లు నేరుగా నల్లబజార్కు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో పౌరసరఫరా శాఖ అధికారులు దాడుల్లో ఈ విషయం బయటపడింది. రైల్వేన్యూకాలనీ, పూర్ణామార్కెట్, తాటిచెట్లపాలెం, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో పలువురు ఆపరేటర్లు పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీ చేయడం లేదు. ఆపరేటర్లపై నిఘా ఉంచాల్సిన సీఎస్ యంత్రాంగం నిద్రపోతోంది. క్షేత్రస్థాయిలో 20 మంది చెకింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు సహాయ సరఫరా అధికారులున్నప్పటికీ కేసులు మాత్రం నామమాత్రంగా నమోదవుతున్నాయి. ఈ వ్యవస్థ వచ్చిన మూడేళ్లలో అక్రమాలకు పాల్పడిన 50 మంది ఆపరేటర్లపై కేసులు పెట్టి జరిమానాలు విధించారు. అయినా అక్రమాలు ఆగకపోవటానికి కొందరు అధికారుల తెరవెనుక సహకారమేననే ఆరోపణలొస్తున్నాయి.
ఇళ్ల వద్దకు వస్తేగా..
ఎండీయూ ఆపరేటర్ల తీరుపై కార్డుహోల్డర్లు పెదవి విరుస్తున్నారు. ఇళ్ల వద్దకు వాహనాలు రావడం లేదని, తమకు నచ్చిన ప్రాంతంలో వాహనం ఆపి ఇస్తున్నారని, సమయం, తేదీ వంటివేవీ తెలియకపోవడం వల్ల ఎప్పుడు వాహనం వస్తుందోనని ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. కూలి పనులకు వెళ్లే తాము వాహనం కోసం ఎదురుచూడడం ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్