logo

సోషల్‌ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్‌ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం.

Published : 24 Apr 2024 04:18 IST

సమావేశంలో పాల్గొన్న ఇతర కన్వీనర్లతో కిలాని రామ్‌ప్రసాద్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్‌ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. 20వ వార్డుకు చెందిన కిలాని రామ్‌ప్రసాద్‌ నియోజకవర్గ వైకాపా సోషల్‌మీడియా కోకన్వీనర్‌గా పనిచేస్తూనే.. ఇటీవల పొరుగుసేవల విధానంలో ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరారు. స్థానిక కార్పొరేటర్‌ బంధువు కావటంతో అనధికారికంగా శానిటరీ సూపర్‌వైజర్‌గా హడావుడి చేస్తున్నట్లు సమాచారం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని