logo

TS News: మావోయిస్టుల కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్‌ సికింద్రాబాద్‌కు తరలింపు

ములుగు జిల్లాలో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. దీంతో అతడిని పోలీసులు...

Published : 18 Jan 2022 23:20 IST

హైదరాబాద్‌: ములుగు జిల్లాలో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. దీంతో అతడిని పోలీసులు హెలికాప్టర్‌లో హనుమకొండకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానిస్టేబుల్‌కు ఛాతి పైభాగంలో బుల్లెట్‌, చేతిలో 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించారు. వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి మూడు బుల్లెట్లు తొలగించారు. కానిస్టేబుల్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని