రవాణా సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలు!
వానాకాలం సీజన్లో మిల్లులకు సొంత కిరాయి చెల్లించి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం బస్తాలను తరలించిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా చార్జీల్లో కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. టన్నుకు రూ. 209.93 చెల్లించాల్సింది రూ.150 చెల్లిస్తూ మిగిలిన రూ.59.93 కాజేశారు.
దంతాలపల్లిలోని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు బస్తాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లు
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: వానాకాలం సీజన్లో మిల్లులకు సొంత కిరాయి చెల్లించి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం బస్తాలను తరలించిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా చార్జీల్లో కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. టన్నుకు రూ. 209.93 చెల్లించాల్సింది రూ.150 చెల్లిస్తూ మిగిలిన రూ.59.93 కాజేశారు. ఇలా రైతుల కష్టార్జితాన్ని జేబుల్లో వేసుకుని రూ.లక్షలు తలా కొంత పంచుకున్నారు. ఈ వ్యవహారమంతా తెలిసినా సంబంధితశాఖ అధికారులు మాములుగా తీసుకున్నారు. దాంతో ధాన్యం రైతులు నష్టాన్ని ఎదుర్కొన్నారు. కిరాయి డబ్బులు చేతికందని రైతులు ఎప్పుడిస్తారంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లో కిరాయి డబ్బులు ఇస్తారనే విషయం అక్కడి రైతులకే తెలియని పరిస్థితి ఉంది..
ఘటనలు ఇలా..
ః తొర్రూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి 4287 టన్నుల ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించారు. వాటన్నింటికీ సంబంధించిన ట్రక్ షీట్లను నిర్వాహకులు పౌరసఫరాలశాఖకు ఇచ్చారు. అధికారులు వారికి రవాణా ఛార్జీలుగా టన్నుకు రూ. 209.93 చొప్పున రూ.9 లక్షలను చెల్లించారు. నిర్వాహకులు రైతులకు టన్నుకు రూ.209.93 చొప్పున కాకుండా రూ. 150 చొప్పున రూ. 6.43 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.59.93 ఇవ్వలేదు. ఈ లెక్కన 4287 టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.2.56 లక్షలు అక్రమం జరిగింది.
*పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్ల ద్వారా తరలించిన 340 టన్నుల ధాన్యానికి టన్నుకు రూ.209.93 చొప్పున రూ.71,376 చెల్లించాలి. నిర్వాహకులు రూ.150 చొప్పున చెల్లించారు. ఇదే మండలంలోని పోచంపల్లి ఐకేపీ కేంద్రం ద్వారా తరలించిన 112 టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.23,512లోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇలా కేసముద్రం, నెల్లికుదురు, కొత్తగూడ, కురవి తదితర మండలాల్లోనూ నిర్వాహకులు, గుత్తేదారులు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకుండా రూ.లక్షలు అక్రమాలకు పాల్పడిన సంఘటనలున్నాయి.
* నర్సింహులపేట, దంతాలపల్లి మండలంలో నర్సింహులపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 1.22 లక్షల టన్నుల ధాన్యాన్ని 2100 ట్రాక్టర్లు, ఇతర సొంత వాహనాల ద్వారా సుమారు 2300 మంది రైతులు మిల్లులకు తరలించారు. ఒక్కో రైతు వాహనాలకు రూ.1500 నుంచి రూ.2500 వరకు కిరాయి చెల్లించారు. వాటికి సంబంధించిన ట్రక్షీట్లను తీసుకున్న పీఏసీఎస్ అధికారులు ఇప్పటికీ రవాణా ఛార్జీలను అందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిరాయి డబ్బులు ఇవ్వలేదు
-ఉడుగుల మల్లయ్య, పెద్దముప్పారం, దంతాలపల్లి
గత వానాకాలంలో 160 బస్తాల ధాన్యం రూ.1800 కిరాయి చెల్లించి ట్రాక్టర్ ద్వారా దంతాలపల్లిలోని మిల్లుకు తరలించా. కిరాయి సొమ్ము ఇస్తారనేది తెలియదు. కొద్ది రోజులకు తోటి రైతులు వస్తాయని చెప్పడంతో అధికారులను అడిగితే ఇస్తామన్నారు. ఇంత వరకు ఇవ్వలేదు. యాసంగిలోనూ 170 బస్తాలను రూ.2 వేల కిరాయితో మిల్లుకు తీసుకొచ్చా. ఈ రెండు పంటలకు సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంది.
కలెక్టర్ చెప్పినా
ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు రవాణా చేసే కాంట్రాక్టరు అనుకున్న మేర లారీలు సరఫరా చేయకపోవడంతో సమస్య వస్తుందని భావించి 20 కిలోమీటర్ల వరకు దూరం ఉన్న మిల్లులకు రైతులే ట్రాక్టర్ల ద్వారా తరలించుకోవాలని..అందుకు సొంతంగా కిరాయి చెల్లిస్తే అ డబ్బులను ఇప్పిస్తామని కలెక్టర్ శశాంక చెప్పారు. అయినప్పటికీ గుత్తేదారు, నిర్వాహకులు తమ విధానాన్ని మార్చుకోలేదు. వానాకాలం సీజన్లో జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. వాటి ద్వారా 39,131 మంది రైతుల నుంచి 1,83,482 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో జిల్లాలోని 53 మిల్లులకు 1.27 టన్నులు, 56 వేల టన్నుల ధాన్యాన్ని వరంగల్, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలకు తరలించారు. జిల్లాలోని మిల్లులకు తరలించిన ధాన్యంలో సగానికి పైగా రైతులు తమ సొంతంగా కిరాయిలు చెల్లించి ట్రాక్టర్ల ద్వారా పంపించినవే ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు రైతుల నుంచి ట్రక్ షీట్లు తీసుకుని కిరాయి డబ్బులు చెల్లించాలి. కాని అధికారులు గుత్తేదారులకు చెల్లించడంతో వారు చేతివాటం ప్రదర్శించారు.
కోత విధించినట్లు తెలియదు..
రవాణాకు సంబంధించిన ట్రక్షీట్లు ఇటీవలే కార్యాలయానికి అందించారు. త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని పౌరసరఫరాల శాఖ మేనేజర్ మహేందర్ తెలిపారు. ప్రస్తుతం చెల్లించిన డబ్బుల్లో కోత పెట్టినట్లు తెలియదన్నారు. అలా ఎందుకు చేశారో తెలుసుకుంటానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పసిబిడ్డ.. మట్టిలో పుట్టిన సీత..!
[ 05-05-2024]
రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది. -
నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలోని 5 నియోజక వర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. -
ఓరుగల్లులో అరూరి గెలుపు ఖాయం
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు ఖాయమైందని వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. -
శిక్షలు పడితే నేరాల సంఖ్య తగ్గుతుంది
[ 05-05-2024]
సమాజంలో నేరం చేసిన వారికి శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. -
మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!
[ 05-05-2024]
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
[ 05-05-2024]
వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది. -
పేదలకు ఉచితంగా న్యాయ సేవలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని సఖి వన్స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్ శనివారం సందర్శించారు. -
వారధి నిర్మాణ పనులు వేగవంతం
[ 05-05-2024]
ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!
[ 05-05-2024]
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. -
‘భాజపాకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’
[ 05-05-2024]
గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న భాజపాకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ఇంటి వద్దే.. ఓటేశారు!
[ 05-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం
[ 05-05-2024]
పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. -
ఆర్టీసీ కార్గో సేవలు అధ్వానం
[ 05-05-2024]
హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్ చేసినా స్పందించకపోవడం, పార్శిల్ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం, -
ప్రజాస్వామ్య పండగకు ఆహ్వానం..!
[ 05-05-2024]
ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. -
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు.