Mahabubabad: ఈ ప్లాట్లు కొంటే పాట్లే!
జిల్లాలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల పరిధిలో స్థిరాస్తి దందా జోరుగా సాగుతోంది.
ఈనాడు, మహబూబాబాద్,న్యూస్టుడే, మహబూబాబాద్: జిల్లాలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల పరిధిలో స్థిరాస్తి దందా జోరుగా సాగుతోంది. కాసులు పంట పండిస్తుండడంతో పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వ్యాపారుల అక్రమార్జనకు పంట పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. అక్రమార్కులు యథేచ్చగా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. డీటీపీసీ, నాలా అనుమతులు లేకుండానే ప్లాట్ల అమ్మకాలు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టింపులేనట్లు వ్యవహరిస్తుండటంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా ఉంది. మహబూబాబాద్ నుంచి తొర్రూరు వెళ్లే దారిలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో సదుపాయాలు ఏమీ కల్పించకుండానే అమ్మకాలు చేస్తున్నారు. తొర్రూరు పట్టణంలో ఒకరు నాలా అనుమతులు లేని ప్లాటు అని తెలియక కొనుగోలు చేశారు. ఇప్పుడు అందులో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి దరఖాస్తు చేసి మున్సిపాలిటీకి వెళ్లితే నాలా అనుమతి లేదంటూ తిరస్కరించారు. ఇదొక ఉదాహరణ. ఈ విధమైన సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులు మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఉన్నారు.
నెల్లికుదురు నుంచి ఇనుగుర్తి వైపు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన వెంచరు ఇది. 2020లో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఇందులో రహదారుల, డ్రైనేజీ నిర్మాణం చేయలేదు. విద్యుత్తు స్తంభాలు లేవు. గ్రామ పంచాయతీకి 10 శాతం స్థలం కేటాయింపు లేదు. కాని నిర్వాహకులు అనుమతులున్నాయని, సదుపాయాలు కల్పిస్తామంటూ విక్రయాలు చేపడుతున్నారు. గజాల చొప్పున కాకుండా గుంటల లెక్కన విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. అందులో ప్లాటు కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేసేటప్పుడు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సంబంధిత అధికారులకు తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
- న్యూస్టుడే, నెల్లికుదురు
గుర్తించడం ఎలా అంటే
- లేఅవుటు అనుమతి పొందితే డీపీ నెంబరు అడగాలి. నెంబరు ఉంటేనే అనుమతి ఉన్నట్లు
- లేఅవుటు ప్లాను చూసుకోవాలి
- పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు సరిచూసుకోవాలి
- అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ప్లాన్లో చూసుకోవాలి
నష్టాలివీ
- గృహాల, ఇతర భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు
- టీఎస్-బీపాస్ ద్వారా అనుమతులు పొందాలంటే అదనంగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది
- బ్యాంకుల నుంచి రుణం రాదు.
- భవిష్యత్తులో స్థలాలపై న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు.
- మౌలిక సదుపాయాలు ఉండవు
తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని పాలకేంద్రం సమీపంలో నాలుగు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన వెంచరు ఇది. సుమారు నాలుగెకరాల విస్తీర్ణంలో వేసిన వెంచరులో నిబంధనలేమీ పాటించలేదు. కొనుగోలుదారులను మభ్యపెట్టడానికి విద్యుత్తు స్తంభాలు నాటారు. కాని వాటికి తీగల ఏర్పాటు చేయలేదు. రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికే ప్లాట్ల విక్రయాలన్నీ పూర్తి చేశారు. ఇలా తొర్రూరు మండల పరిధిలో సుమారు 12 వెంచర్ల వరకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
న్యూస్టుడే, తొర్రూరు
నిబంధనలు ఇలా
- కొత్తగా స్థిరాస్తి వెంచర్ ఏర్పాటు చేసే వారు లేఅవుట్ అనుమతులు పొందాలంటే ఆ స్థలంలో రోడ్లు, కాలువల నిర్మాణం చేయాలి.
- విద్యుత్తు స్తంభాలు, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించాలి.
- నాలా అనుమతి పొందడానికి 10 శాతం ఆ పైన ఖాళీ స్థలం మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి అప్పగించాలి.
- ఆ స్థలాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకొస్తారు.
- వెంచర్లు చేస్తున్న వారు పై నిబంధనలేవీ పాటించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. కొనుగోలుదారులను మోసగిస్తున్నారు.
కార్యదళం ఉన్నా
అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు శాఖలకు చెందిన అధికారులుంటారు. వీరు పుర, గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై నిఘా పెట్టి వాటిని ఆరికట్టాలి. కాని కార్యదళం పూర్తిస్థాయిలో పనిచేయనందునే అనుమతులు లేని వెంచర్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం
కె.ప్రసన్నరాణి, కమిషనర్, మహబూబాబాద్
టీఎస్-బీపాస్ వచ్చాక పట్టణంలో 12 వెంచర్లకు అనుమతులు వచ్చాయి. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన 10 వెంచర్లకు నోటీసులు ఇచ్చాం. కొన్నింటిపై చర్యలు కూడా తీసుకుంటున్నాం. వాటిలో ఏర్పాటు చేసిన హద్దులు తొలగించాం. రోడ్లు ధ్వంసం చేశాం. లే అవుట్ ఉన్న వాటికే నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం. అలాంటి వాటిలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. అనుమతులు లేని వాటిలో కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరుగెత్తి.. ఓటు విలువ చాటి..
[ 06-05-2024]
ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో వరంగల్ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కె రన్ ఉత్సాహంగా జరిగింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ కూడలి, కాళోజీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు పరుగు సాగింది. -
హోరెత్తనున్న ప్రచారం
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రచారం చేశాయి. -
పరిశ్రమలు రావాలి.. ఓరుగల్లు మురవాలి
[ 06-05-2024]
ఉమ్మడి వరంగల్ విద్యా కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి.. పరిశ్రమల్లో మాత్రం వెనుకబాటులో ఉంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లులో ఐటీ సంస్థలు ఏర్పాటుచేస్తే ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రానైట్, జౌళి, ఉక్కు తదితర రంగాల్లో ఇండస్ట్రీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో అనేక ఆహార శుద్ధి యూనిట్లు ప్రారంభించొచ్చు. -
ఎన్నికల వేళ.. మద్యం జోరు
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. -
ఓటేశారు.. స్ఫూర్తి రగిలించారు..!
[ 06-05-2024]
అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. -
భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదు
[ 06-05-2024]
కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
చేసింది కొంత.. చేయాల్సింది కొండంత
[ 06-05-2024]
‘2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’ వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. -
కాంగ్రెస్ వచ్చాక పథకాలు ఆగాయి
[ 06-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్మరించిందని, లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేయిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
‘ప్రధాని మోదీ తెలంగాణకు చేసింది శూన్యం’
[ 06-05-2024]
రాష్ట్ర విభజన చట్టం హామీలను విస్మరించిన భాజపాకు లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని, రాహుల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. -
రైతుల దరి చేరని భూసార పరీక్షలు
[ 06-05-2024]
దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. -
ఎట్టకేలకు తారు పడింది..!
[ 06-05-2024]
వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది. -
వేసవి తాపం.. మారిన షిఫ్టు సమయం
[ 06-05-2024]
ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. -
ముందస్తుగా ఓటేశారు!
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల ప్రచారాలు.. మరో వైపు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. -
‘భాజపా, భారాసలకు ఓటేస్తే మురిగిపోతుంది’
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలకు ప్రజలు ఓటేస్తే మురిగిపోతుందే తప్ప.. పనికిరాదని వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. -
అనారోగ్యంతో ఓటరు.. బాధ్యత మరవలేదు!
[ 06-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్లో ఆదివారం నుంచి ‘ఇంటి నుంచి ఓటు’ కార్యక్రమం ప్రారంభమైంది. డోర్నకల్కు చెందిన ఓటరు వెంకటేశ్వరరావు రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. -
ప్రధాని మోదీ సభకు ఆహ్వాన పత్రిక
[ 06-05-2024]
ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలంటూ మొదటిసారి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వినూత్న ప్రచారానికి వరంగల్ భాజపా నాయకులు శ్రీకారం చుట్టారు. -
నీట్కు 13 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పరీక్షకు ఉదయం 11 నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
[ 06-05-2024]
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం